The Raja Saab OTT : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా వస్తుంది అంటేనే సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ప్రభాస్(Prabhas) సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ ఏ ఇతర హీరోల సినిమాలకు కూడా రావనే చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. త్వరలోనే ప్రభాస్ హీరోగా మారుతి (Maruthi)దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హర్రర్ థ్రిల్లర్ ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది . ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఇకపోతే గత రెండు రోజుల వరకు ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా అమ్ముడు పోలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జియో హాట్ స్టార్ (Jio HotStar)కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు వచ్చే ఆదరణ బట్టి రాజాసాబ్ సినిమా డిజిటల్ హక్కుల ధరలు కూడా పెరుగుతాయని తెలుస్తుంది.
సాధారణంగా ఒక సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయింది అంటే మొదట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాతలకు డబ్బులు చెల్లిస్తారు. తరువాత ఆ సినిమాకు ఎన్ని వ్యూస్ వచ్చాయనే విషయంతో నిర్మాతలకు సంబంధం ఉండదు. అలా కాకుండా మరో విధంగా కూడా చిత్ర నిర్మాతలతో ఓటీటీ సంస్థలు డీల్ కుదుర్చుకునే ముందు వ్యూయర్ షిప్ లేదు అనుకుంటే వచ్చిన వ్యూస్ లోనే 20 లేదా 30% డబ్బులను నిర్మాతలకు ఇస్తారు. చిన్న సినిమాల విషయంలో ఇలాంటి పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు కానీ రాజా సాబ్ సినిమాకు మాత్రం 140 కోట్ల రూపాయలతో భారీ డీల్ కుదుర్చుకోవడమే కాకుండా వచ్చిన వ్యూస్ లో కూడా షేర్ ఉంటుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు లేనివిధంగా రాజా సాబ్ సినిమాకు ఇలాంటి డీల్ కుదుర్చుకోవటం విశేషం.
ప్రభాస్ కు జోడిగా ముగ్గురు…
ఇలా చరిత్రలోనే మొదటిసారి రాజా సాబ్ సినిమాకు ఇలాంటి డీల్ కుదరడంతో చిత్ర నిర్మాతలకు భారీ లాభాలు ఉంటాయని చెప్పాలి. ప్రభాస్ ఈ సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఇలాంటి కామెడీ హర్రర్ సినిమా ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ కూడా మంచి అంచనాలనే పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Kriti Sanon: ప్రభాస్ మాత్రమే సరైనోడు.. కృతి సనన్ కామెంట్స్ విన్నారా?