The Raja Saab OTT: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల ది రాజా సాబ్ (The Raja Saab)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా థియేటర్లలో అభిమానులను పూర్తిగా నిరాశపరిచిన రాజ్యసభ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్(Jio Hot Star) కొనుగోలు చేశారు. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటీటీలో ప్రసారం కాబోతున్నట్లు జియో హాట్స్టార్ అధికారికంగా తెలియజేశారు. ఇకపోతే తాజాగా జియో హాట్ స్టార్ ప్రభాస్ (Prabhas)అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఇదివరకు కట్ చేసిన సన్నివేశాలను కూడా జత చేసి ప్రసారం చేయబోతున్నట్లు తెలియజేశారు. థియేటర్ వెర్షన్ కంటే అదనంగా ఎడిటింగ్ లో కూడా కట్ చేస్తున్న సన్నివేశాలను ఓటిటిలో ప్రసారం చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా థియేటర్లో ముందుగా ప్రభాస్ ఓల్డ్ గెటప్ కి సంబంధించిన సీన్లు అన్నింటినీ కూడా తీసేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దీంతో అభిమానులు పెద్ద ఎత్తున సినిమా విషయంలో నిరాశ వ్యక్తం చేశారు. ఇలా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో తిరిగి ప్రభాస్ ఓల్డ్ గెటప్ కి సంబంధించిన సీన్లు అన్నింటిని కూడా జత చేస్తూ థియేటర్లో విడుదల చేశారు. ఇలా థియేటర్ లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ రాలేదని చెప్పాలి. థియేటర్లలో ప్రేక్షకులను పూర్తిగా ఈ సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో ఓటీటీలో మరిన్ని అతను సన్నివేశాలతో విడుదల కాబోతుందని తెలుస్తుంది.
Due to unforeseen circumstances and last-minute technical glitches, we’ve added the extended cut! ⚠️
Regret the inconvenience caused due to hype 🙂
India's Biggest Superstar on JioHotstar | 6th Feb 👑#TheRajaSaabOnJioHotstar #TheRajaSaab #ExtendedCut #JioHotstar pic.twitter.com/3Kq7ofY8qT
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 5, 2026
ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులకు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లో ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా ఈ సినిమా ఓటీటీలో అయిన ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్య పాత్రలో కనిపించారు. ఇక ప్రభాస్ జోడిగా రిద్ది కుమార్, మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.
Also Read: Priyanka Chopra: ఆ మూడు నెలలు నరకం చూసా.. కూతురి విషయంలో ప్రియాంక ఎమోషనల్!