The Raja Saab OTT: ప్రభాస్ హీరోగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ (Prabhas)పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా 1000 కోట్ల కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ డైరెక్టర్ మారుతికి సినిమా అవకాశం ఇవ్వడంతో అభిమానులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇలా మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయింది దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో డైరెక్టర్ మారుతి పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ఈ సినిమా కనీసం 300 కోట్లకు కూడా రాబట్టిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు వందల కోట్ల నష్టాలు వచ్చాయని చెప్పాలి. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిన రాజా సాబ్ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్(Jio Hot Star) ఏకంగా 80 కోట్లకు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అధికారికంగా తెలియజేసింది..
Mana time start ayyindhi 🖤🔥
This Feb 6th, step into the trance of the India’s Biggest Superstar on JioHotstar! 🦖#TheRajaSaabOnJioHotstar #TheRajaSaab #JioHotstar pic.twitter.com/LKZGl5vPh3
— JioHotstar Telugu (@JioHotstarTel_) January 30, 2026
ది రాజా సాబ్ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటీటీలోకి రాబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. థియేటర్లలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేకపోయినా ఈ సినిమా ఓటీటీలో అయిన మంచి ఆదరణ సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఎవరైతే థియేటర్లలో చూడటం మిస్ అయి ఉంటారో అలాంటి వారు ఓటీటీలో ఈ సినిమా చూసే వెసులుబాటు కలిగింది. మరి ఇక్కడైనా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని ప్రభాస్ పరువు నిలబెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నానమ్మ మనవడి నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ఇక ఇందులో ప్రభాస్ జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. రిద్ది కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా మారుతి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్య పాత్రలో నటించారు.