NEXA Awards 2026:అవార్డు అనేది ఒక నటుడి ప్రతిభకు దక్కే ఫలితం. అంతేకాదు ఆ అవార్డు లభించడం వల్ల ఆ నటీనటులలో ఇంకా బాగా నటించాలి అనే పట్టుదల పెరుగుతుంది. అలా విజయానికి చిహ్నంగా నిలిచే ఈ అవార్డులు సెలబ్రిటీలను ఎక్కడికో తీసుకెళ్తాయి. అంతేకాదు ఈ అవార్డు అందుకోవడం కోసమైనా సరే అద్భుతంగా నటించే నటీనటులు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా ఇటీవల జూలై 18వ తేదీన 72వ జాతీయ చలనచిత్రం అవార్డుల ప్రకటన ఘనంగా జరిగింది. ముఖ్యంగా సినిమాలలో సత్తా చాటిన సెలబ్రిటీలకు ఈ అవార్డును అందజేస్తారు.
అయితే ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, వెబ్ సిరీస్ లను సత్కరిస్తూ.. మారుతి సుజుకి నెక్సా ఇండియన్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ 2026 వేడుక చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా మారుతి సుజుకి నెక్సా ఇండియన్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ మూడవ ఎడిసన్ ముంబైలోని ఫైర్ మాంట్ హోటల్లో జూలై 19వ తేదీన చాలా ఘనంగా జరిగింది. భారతదేశ నలుమూలల నుండి ఓటీటీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ అవార్డులతో సత్కరించారు.
also read:సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!
అయితే ఈ అవార్డుకి టాలీవుడ్ నటుడు ఎంపికవడం గమనార్హం. విభిన్నమైన కథలతో, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ.. తెలుగు నటులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న రాగ్ మయూర్ ముంబై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా సివరపల్లి వెబ్ సిరీస్ లో ఆయన పోషించిన పాత్రకు అవార్డు లభించింది. పైగా టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు అన్ని సినీ పరిశ్రమల సెలబ్రిటీలు ఈ ఈవెంట్లో సందడి చేశారు.
ఇకపోతే దేశవ్యాప్తంగా ప్రకటించిన అవార్డులలో తెలుగు నటుడు రాగ్ మయూర్ ఈ అవార్డును అందుకోవడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రాగ్ మయూర్ విషయానికి వస్తే.. 2021 లో వచ్చిన బండి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయన.. ఆ తర్వాత వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, మిత్రమండలి, పరదా, శుభం, గాంధీ తాత వంటి చిత్రాలలో హీరోగా, కమెడియన్ గా, విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్ కు రీమేక్ గా వచ్చిన సివరపల్లి వెబ్ సిరీస్ లో హీరోగా నటించి ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో అనుమాన పక్షి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.