Year Ender 2025 : ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భారీ అంచనాలతో వచ్చిన ఎన్నో సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. కానీ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందే సగం బడ్జెట్లను రాబట్టి, నిర్మాతలకు భారీ లాభాలను ఆర్జించాయి. థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబట్టడమే కాకుండా, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా భారీగానే రాబట్టాయి. ఈ సంవత్సరం అలా భారీ డీల్స్ కుదుర్చుకున్న అత్యంత ఖరీదైన ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ ఈ సంవత్సరమే విడుదలైంది. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత, అభిమానులకు ఇమ్రాన్ హష్మి దక్షిణ భారత అరంగేట్రాన్ని చూసే అవకాశం లభించింది. అలాగే పవన్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను రూ.92 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంలో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ తో పాటు ప్రియాంక మోహన్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ కి ముందు విపరీతమైన హైప్ను సృష్టించింది. కానీ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు దీన్ని నెట్ఫ్లిక్స్లో ఆస్వాదించవచ్చు. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.85 కోట్లకు సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా థియేటర్లలో రూ.350 కోట్లకు పైగా వసూలు చేస్తే, అంతకంటే ముందే జరిగిన ఓటీటీ డీల్ ద్వారా దాదాపు మేకర్స్ 100 కోట్లు జేబులో వేసుకున్నారు.
సౌత్ సూపర్ స్టార్ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ ‘జననాయగన్’ విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ. 110 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు విన్పిస్తున్నాయి.
రజనీకాంత్ చిత్రం “కూలీ” బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మరోసారి ఈ శక్తివంతమైన చిత్రంతో రజనీకాంత్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ మూవీ డిజిటల్ హక్కుల విషయానికొస్తే, “కూలీ”ని ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆదిత్య ధర్ తీసిన ఈ స్పై యాక్షన్ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం వరుసగా రెండు వారాలుగా భారీ కలెక్షన్లను రాబట్టింది. సమాచారం ప్రకారం Netflix “ధురంధర్” ఓటీటీ హక్కులను రూ. 285 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వార్తలు నిజమైతే ఈ సంవత్సరం ఇదే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.
Read Also : ‘స్క్విడ్ గేమ్ 3’ నుంచి ‘వీక్ హీరో’ వరకు… ఈ ఏడాది ఓటీటీని ఏలిన కొరియన్ డ్రామాలు ఇవే