CPI Narayana: దేశంలో ప్రస్థతం జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికలపై సీపీఐ నారాయణ తన దైన శైలిలో విష్లేషించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో బీజేపీ అధికారం ఊహించిందే అని సీపీఐ నారాయణ అన్నారు. దేశంలో కేరళం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో మాత్రం బీజేపీకి ప్రత్యర్థులకు అంతు చూశారని అన్నారు. గతంలో చంద్రబాబును ఓడించడానికి ఏమేం చేశారో సేమ్ బెంగాల్లో కూడా అదే జరిగిందని అన్నారు. తమిళనాడులో విజయ్ గెలుస్తాడని, ముఖ్యమంత్రి అవుతాడని ఎవరూ కూడా ఊహించలేదని అన్నారు.
అస్సాంలో బీజేపీ గెలుపు పెద్ద ఆశ్చర్యం కలిగించ లేదని కానీ మిగతా రాష్ట్రాలైన కేరళం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో మాత్రం బీజీపీకి చుక్కులు చూపించారని అన్నారు. అస్సాం రాష్ట్రంలో మతపరమైన మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు చీలడం వల్ల బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం నేను ముందే ఊహించానని సీపీఐ నారాయణ అన్నారు. అస్సాంలో బీజేపీ వ్యూహం గట్టిగా పనిచేసిందని నారాయణ అన్నారు.
Also Read: దళపతి విజయ్ ప్రసంగిస్తుంటే త్రిష ఏం చేసిందో తెలుసా?.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
బెంగాల్ ఫలితాలపై సీపీఐ నారాయణ ఓక ఆసక్తికరమైన పొలిటికల్ పోలికను తెరమీదికి తెచ్చారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని ఓడించడానికి ప్రజలు ఎలాగైతే ఏకమయ్యారో సేమ్ బెంగాల్లో కూడా అలాగే మమతా బెనర్జీని గెలిపించి బీజేపీని అడ్డుకోవడానికి ప్రజలు అదే స్థాయిలో కంకణం కట్టుకున్నారని గుర్తు చేశారు. అని ఆయన విశ్లేషించారు. కేంద్రం బలగాలు, ఈడీ, ఐటీ సంస్థలను అడ్డం పెట్టుకుని బెంగాల్ కోటను పడగొట్టాలని చూసిన బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు.
అస్సాంలో బీజేపీ అధికారం ఊహించిందే: సీపీఐ నారాయణ
కేరళం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో మాత్రం ప్రత్యర్థుల అంతు చూశారు
గతంలో చంద్రబాబును ఓడించడానికి ఏమేం చేశారో.. బెంగాల్లో కూడా అదే జరిగింది
తమిళనాడులో విజయ్ గెలుస్తాడని, ముఖ్యమంత్రి అవుతాడని ఎవరూ ఊహించలేదు
– సీపీఐ… pic.twitter.com/GM8EEfREkN
— BIG TV Breaking News (@bigtvtelugu) May 11, 2026
Also read: ఉచిత కుట్టు మిషిన్ల పంపిణీ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారా.. కావలసిన పత్రాలివే?