ఈటల రాజేందర్ ఇజ్జత్ తీసుకున్నాడా? అప్పటి వరకు ఆయనకు కాంగ్రెస్ కూడా మర్యాద ఇచ్చిందా? ఒక్క కాళేశ్వరం గురించి, ఓ రెండు మంచి మాటలు చెప్పడమే ఆయన పరువు పోవడానికి కారణమైందా? అచ్చంగా ఇదే విశ్లేషణ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్.
మధ్యలో నీకెందుకయా.. ఈ విషయం. మేమూ మేమూ చూసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు బీజేపీ లీడర్. కాళేశ్వరం గురించి మాట్లాడితే నీ పార్టీకి వచ్చే మైలేజీ ఏమైనా ఉందా? నయా పైసా లేదు. అది బీఆరెస్కే మైలేజీ తెచ్చిపెడుతుంది. మరి సత్యహరశ్చంద్రుడి లెక్క నువ్వెందుకు మధ్యలో వచ్చి మాట్లాడుతావ్..? నీది నీకే సక్కగా లేదు. నీ పార్టీలో నిన్నే దేకుతలేరు. మరి దీని వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? అంటే కాంగ్రెస్ను ఇరుకున పెట్టుందుకే పాత దోస్తానాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నావా? మరి మేమెందుకు నీకు మర్యాద ఇయ్యాలె.. అయితే ఇగో చూస్కో మా తడాఖా..! కాస్కో ఈటల… నీకు తప్పవిక ఈటెల పోటులు.. అని రేవంత్ బాగానే అర్సుకున్నాడు.
మేము కొట్లాడుతుంటే మధ్యలో వేలు పెట్టడమే కాదు.. నాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం.. నా కణతకు తుపాకీ గురిపెట్టి కాల్చినా.. నేను నా వైఖరి వీడను.. నాకు ముందు తెలంగాణ ప్రయార్టీలు ప్రాధాన్యం.. తరువాతే పార్టీ .. ఇంకేదైనా..? అంటూ బీరాలు పలికి, నీతులు చెప్పిన వైనం పట్లా కాంగ్రెస్ కస్సుమంటోంది.
నేను సిద్దాంతాలు మార్చుకుని, చచ్చినా నా అభిప్రాయాలు మారవు, నీతి నిజాయితీ నా రెండు కండ్లు అనే లెవల్లో సినిమా డైలాగులు కొట్టిన ఈటల రాజేందర్ను బాగానే లెక్చరిచ్చాడు రేవంత్రెడ్డి.
కరుడుగట్టిన నక్సలిజం భావాలు, విప్లవ భావాలు కలిగిన ఈటల, తన అవవసరాల కోసం మతతత్వ పార్టీ పంచన చేరలేదా? అని అప్పుడే ట్రోలింగులు మొదలయ్యాయి. బీజేపీ అంటేనే గిట్టని ఈటల.. మరెందుకు ఆపార్టీని ఎంచుకున్నాడు…? కేసులకు భయపడా..? ఆ పార్టీ కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు కదా.. మరెందుకు ఆత్మగౌరవం గురించి పెద్ద డైలాగులు అని కూడా తిట్టిపోస్తున్నారు. నీ మీద మొన్నటి దాకా అంతో ఇంతో మర్యాద ఉండే. ఇప్పుడు పాత దోస్తానా మాయలో పడి అదీ పోగొట్టుకున్నావ్.. పో! అని తిట్టుకున్నంత పని చేస్తున్నారు.