E-Paper
Advertisement

రూటు మార్చిన వైసీపీ.. మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

రూటు మార్చిన వైసీపీ..  మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

AP Political: ఏపీలో వైసీపీ రూటు మార్చిందా? కూటమి చేసే పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందా? జగన్ మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా అదే రాగం అందుకున్నారా? తాజాగా రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

గురువారం కడపలో మీడియాతో మాట్లాడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది రాయలసీమ ద్రోహులు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్ట్‌లు కేవలం వైయస్సార్ పుణ్యమేనని అన్నారు. పోతిరెడ్డిపాడు, జీయన్‌యస్‌యస్ లాంటి కీలక ప్రాజెక్టులు ఆయన కట్టించినవేనని అన్నారు.

గాలేరు-నగరి, గండికోట ప్రాజెక్ట్‌లకు ఎన్టీఆర్ పేరు పెడితే వైయస్సార్ పూర్తి చేశారని కుండబద్దలు కొట్టేశారు. రాయలసీమలో ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఏ మాత్రం లేదన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ లాక్కున్న రోజు 1995 నుంచి ఇప్పటివరకు చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదన్నారు. నికర జలాలతో ప్రాజెక్ట్ కట్టిన ఘనత వైయస్సార్‌కి ఆ క్రెడిట్ దక్కుతుందన్నారు.

ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్ఆర్‌కే చెందుతుంది

గండికోట ప్రాజెక్ట్‌కి మూడు టీయంసీ చాలని సీఎం చంద్రబాబు జీవో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దాన్ని 20 టీఎంసీలుగా మార్చిన ఘనత వైయస్సార్‌కు దక్కుతుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమన్నారు. అదే సమయంలో అమరావతికి 2 లక్షలు కోట్లు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

గొల్లపల్లె ప్రాజెక్ట్ వల్లే అనంతపురంకు కియా ప్రాజెక్ట్ వచ్చిందంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. గొల్లపల్లె ప్రాజెక్ట్ పూర్తి చేసింది వైయస్ఆరేనని, రాయలసీమలో హైకోర్టు ఉంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. దోపిడి కోసం అమరావతి నిర్మాణం చేస్తున్నారని, లక్షల కోట్లు అప్పులు చేసి మా ప్రాంతంపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.

ALSO READ: మంత్రి లోకేష్‌పై వర్మ సంచలన కామెంట్స్.. ఎవరు ఉన్నారంటూ ఎదురుప్రశ్న, జనసేనలో చర్చ

కూటమి తప్పులు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అధినేత బాటలో వైసీపీ నేతలు నడుస్తున్నారు. వైసీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, కూటమి పనులు చేస్తుంటే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి.

Related News

నువ్వా నేనా..? నాకా నీకా..!? కేంద్ర మంత్రి ప‌ద‌వి కోసం వ‌ర్గ‌పోరు..!

ఆ ఇద్ద‌రికీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే టార్గెట్‌! ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల రాజ‌కీయ వ్యూహం ఇదే!

బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?

లీడ‌ర్‌గా విమ‌ర్శ‌లు.. హీరోగా అభిమానం! ప‌వ‌న్ పై కేటీఆర్ మ‌నోగ‌తమిదేనా? ప‌వ‌న్ సినిమాలంటే అంత ఇష్ట‌మా?

మోడీ.. తేజ‌స్వీ సూర్య‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..! తెలంగాణ‌పై అవే అవే మాట‌లు! తేడా లేదు.. పాపం.. బీజేపీ!

అయ్య జాగీరే! రెచ్చ‌గొట్టి.. చిచ్చుపెట్టి..! తెలంగాణ బీజేపికి కొత్త చిక్కు తెచ్చిపెట్టి!

గ‌ద్ద‌ర్‌కు కారు కొనిచ్చా..! ఇదిప్పుడు బ‌య‌ట‌పెట్టడం వెనుక నీ ఉద్దేశ‌మేంద‌యా ప‌వ‌ను!?

డిమాండ్లు పెడుతూ.. డేట్లు ఫిక్స్ చేసుకుంటూ..! స‌ర్కార్ కు క‌విత డెడ్‌లైన్‌ల త‌ల‌నొప్పి..

Big Stories

×