Ap Politics: టీడీపీలో రాజకీయాలు పీక్స్కు చేరాయా? వర్మ కామెంట్స్పై కూటమిపై దుమారం రేగుతోందా? జనసేన అధినేతను టార్గెట్గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? ఇంతకీ వర్మ మాటల వెనుక అసలు మర్మమేంటి? ఇటు టీడీపీ.. అటు జనసేన నేతలు ఏమంటున్నారు? దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
మంత్రి లోకేష్పై పిఠాపురం వర్మ సంచలన కామెంట్స్
టీడీపీ హైకమాండ్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. యువనేతలకు కీలక పదవులను అప్పగించింది. మంత్రి నారా లోకేష్కు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించింది. యువనేతకు కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు అన్నారు. రేపటి రోజున పార్టీ ఆయన అధ్యక్షుడు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ మరి కొందరు నేతలు చెప్పుకొచ్చారు.
తాజాగా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మరో అడుగు ముందుకేశారు. ముఖ్యమంత్రి రేసులో నారా లోకేష్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. గురువారం మీడియా ముందుకొచ్చిన ఆయన, ఏపీలో ఆయన కన్నా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అర్హుడైన నాయకుడు ఎవరూ ఉన్నారంటూ ఎదురు ప్రశ్నించారు.
లోకేష్ కంటే రాష్ట్రంలోొ ఎవరు ఉన్నారంటూ ఎదురుప్రశ్న.. ఆపై జనసేనలో చర్చ
యువగళం పాదయాత్రతో టీడీపీకి పూర్వవైభవం తెచ్చారని, అంతేకాదు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ అని ఆకాశానికి ఎత్తేశారు. వర్మ వ్యాఖ్యల వెనుక మరో వెర్షన్ కూడా బలంగా వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన తన కంచుకోటగా మార్చుకోవడం ఆయనకు మింగుడుపడడం లేదని అంటున్నవాళ్లు లేకపోలేదు. ఈ నేపథ్యంలో లోకేష్ను టచ్ చేస్తూ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జనసేన నేతలు వర్మ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. మొత్తానికి వర్మ చేసిన కామెంట్స్పై జనసేనలో చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైంది.
నెక్స్ట్ సీఎం నారా లోకేష్ ..వర్మ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఆయన కన్నా సీఎం పీఠాన్ని అధిరోహించడానికి..
అర్హుడైన నాయకుడు.. ఎవరూ ఉన్నారంటూ ఎదురు ప్రశ్నయువగళం పాదయాత్రతో టీడీపీ పార్టీని నిలబెట్టి..
అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు లోకేష్కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన… pic.twitter.com/d8XwhxhgJH
— BIG TV Breaking News (@bigtvtelugu) April 16, 2026