AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత పెంపునకు కృషి జరగాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ ఎంఐసీ మేనేజింగ్ ఎడిటర్ వికాస్ వర్మ అన్నారు. ఈ దిశగా కృషి జరగాలన్న సంకల్పంతో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నామని తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ‘ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంట్రపెన్సూర్సిప్ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండో రోజు కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరం ఉద్యోగాలు యాచించే స్థాయిలో కాకుండా సృష్టించే స్థాయిలో ఉండాలన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఉన్న అంతర్గత సామర్థ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
Also Read: Tollywood : వామ్మో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్ ఫోటో వైరల్!
ఇందుకోసం నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్నారు. పాఠశాల స్థాయిలో ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్లో సృజనాత్మక ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు నాంది పలికే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రయత్నం రానున్న రోజుల్లో ఫలవంతం అవుతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ చైర్మన్ గోపాల్ రెడ్డి, డైరెక్టర్ రాజిరెడ్డి, రిసోర్స్ పర్సన్లు లావణ్య, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Also Read: ISRO: రూ.2లక్షల జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు, జాబ్ వచ్చేస్తది..