Bolt Robot| మనుషులు శారీరక శ్రమతో పనిచేసే చాలా పనులు భవిష్యత్తులో రోబోలు చేయగలవు. దీని కోసం చైనా కంపెనీ ఒక రోబోను తయారు చేసింది. ఈ రోబో ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తుతుందని కంపెనీ దావా చెప్పింది. ఈ రోబోకు సంబంధించిన వీడియోను కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ఫాం Xలో షేర్ చేసింది. వీడియో వైరల్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది.
ఈ రోబోను చైనా స్టార్టప్ కంపెనీ మిర్రర్మీ టెక్ తయారు చేసింది. ఈ రోబో 10 మీటర్ల దూరాన్ని కేవలం ఒక సెకనులో పూర్తి చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది మానవ ఆథ్లెట్ రికార్డ్ చేసిన వేగం కంటే ఎక్కువ. వీడియోలో మనిషితో రోబో పరుగు పందెంలో పోటీ పడుతుంది. మనిషి పరిగెత్తే సమయంలో పడిపోతాడు. కానీ రోబో స్థిరంగా, వేగంగా పరిగెత్తి గెలుస్తుంది. చాలా మంది యూజర్లు దాని కదలికలు ఎంత నేచురల్గా ఉన్నాయో చూసి ఆశ్చర్యపోయారు.
ఈ హ్యూమనాయిడ్ రోబో పేరు బోల్ట్. ఈ పేరు ఫేమస్ రన్నర్ ఉసేన్ బోల్ట్ నుంచి తీసుకున్నట్లు అనిపిస్తోంది. టెస్టింగ్ సమయంలో బోల్ట్ రోబో మనుషులను సులభంగా ఓడించింది. రోబో బరువు సుమారు 75 కిలోలు. ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. మనుషుల్లా నడవడం, పరుగులు గెత్తడం, స్ప్రింట్ చేయడం చేయగలదు. కంపెనీ ప్రకారం.. బోల్ట్ ఒక్క సెకనుకు 10 మీటర్ల వేగం చేరుకోగలదు. ఇది ఇప్పటివరకు తయారైన అతి వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోలలో ఒకటి.
మిర్రర్మీ టెక్ స్పోర్ట్స్లో మనుషుల కంటే బెటర్గా పనిచేసే రోబోలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అడ్వాన్స్ రోబోటిక్స్తో ఫిజికల్ లిమిట్స్ను టెస్ట్ చేయాలని చూస్తోంది. మనుషుల బ్యాలెన్స్, కదలికలను మ్యాచ్ చేసే రోబోలు తయారు చేయాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఇలాంటి రోబోలు ట్రైనింగ్, రీసెర్చ్లో సహాయపడవచ్చు. ప్రకృతి విపత్తుల్లో రెస్క్యూ ఆపరేషన్లలో కూడా ఉపయోగపడవచ్చు.
మిర్రర్మీ టెక్ బ్లాక్ పాంథర్ II అనే మరో రోబోను అభివృద్ధి చేస్తోంది. ఈ రోబో 100 మీటర్ల రేస్ను 13.11 సెకన్లలో పూర్తి చేస్తుందని చెబుతున్నారు. ఇది ప్రొఫెషనల్ మానవ ఆథ్లెట్ల సమయానికి దగ్గరగా ఉంది. ఈ రెండు రోబోలను కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పెర్ఫామెన్స్ వీడియోలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో
మిర్రర్మీ టెక్ 2024లో స్థాపించబడిన చైనా రోబోటిక్స్ స్టార్టప్. ఝెజియాంగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు కంపెనీలోని కోర్ టెక్నికల్ టీమ్గా ఉన్నారు. బోల్ట్ తప్ప బాబావో, అపోలో అనే రోబోలు కూడా ఉన్నాయి. ఈ రోబోలు మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్పై దృష్టి పెడతాయి. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ భవిష్యత్తులో లీడ్ చేయాలని మిర్రర్మీ టెక్ లక్ష్యంగా పెట్టుకుంది. మనుషులతో కలిసి పనిచేసే రోబోలు తయారు చేయాలని, ఫిజికల్(శారీరక) చాలెంజ్లలో మనుషులతో పోటీ పడే రోబోలు తయారు చేయాలని భావిస్తోంది.