E-Paper
Advertisement

Pawan Kalyan: రోడ్డు లేక విద్యార్ధుల ఇక్కట్లు.. కదిలిన డిప్యూటీ సీఎం.. ఆగమేఘాలపై ఆదేశాలు

Pawan Kalyan: రోడ్డు లేక విద్యార్ధుల ఇక్కట్లు.. కదిలిన డిప్యూటీ సీఎం.. ఆగమేఘాలపై ఆదేశాలు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ‘పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి’ అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశంపై ఆయన చలించిపోయారు. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి కదిలిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు.

వివరాల్లోకి వెళ్తే.. 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద రోడ్డులో స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ ఇటీవల సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఈ విషయం శుక్రవారం పవన్ దృష్టికి వచ్చినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది.

కలెక్టర్‌కు ఫోన్.. కీలక ఆదేశాలు

విద్యార్థుల అవస్థలు చూసి చలించిపోయిన పవన్.. వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఆ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించి తక్షణమే రహదారి మంజూరు చేయాలని ఆదేశించారు. 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరిపోనున్నాయి.

నెల్లూరు జిల్లాలో భారీగా రోడ్ల నిర్మాణం

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.

Also Read: Human Interest Story: పెళ్లి కోసం 97 ఏళ్ల వృద్ధుడి పోరాటం.. కొడుకుపై గెలిచి.. ప్రేయసిని దక్కించుకొని..!

సాస్కీ నుంచి రూ.9 కోట్లు..

సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు రోడ్ల కోసం వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది.

Also Read: Medaram Jatara 2026: మేడారం భక్తుల వింత కోరికలు.. నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి భయ్యా!

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×