E-Paper
Advertisement

క్వాంటం రాజధానిగా అమరావతి.. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

క్వాంటం రాజధానిగా అమరావతి.. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Advertisement

Amarawati Quantum Valley Launch: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని భారత దేశపు క్వాంటం రాజధానిగా (Quantum Capital of India) అభివర్ణించారు. దేశంలోనే మొట్టమొదటి ఓపెన్ యాక్సెస్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించారు. అమరావతి 1ఎస్ (Amarawati 1S), అమరావతి 1క్యూ (Amarawati 1Q) అనే రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం (SRM University), మేధా టవర్స్ (Maidha Towers) వేదికలుగా ఆయన జాతికి అంకితం చేశారు. కేవలం ఏడు నెలల స్వల్ప కాలంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని నిర్మించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన కొనియాడారు.

క్వాంటం సాంకేతికత అనేది కేవలం ఒక పరికరం మాత్రమే కాదని, ఇది రాబోయే కాలంలో అన్ని ఫ్రంటియర్ టెక్నాలజీలకు తల్లి వంటిదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో సిలికాన్ వ్యాలీ గురించి ప్రపంచం మాట్లాడుకునేదని, భవిష్యత్తులో క్వాంటం వ్యాలీ (Amarawati Quantum Valley) గురించి మాట్లాడుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం టిఐఎఫ్ఆర్ (TIFR), ఐఐఎస్సీ (IISc), ఐఐటీలు, డిఆర్డిఓ (DRDO) వంటి ప్రముఖ జాతీయ సంస్థలతో పాటు దేశీయ స్టార్టప్‌లు ఏకతాటిపైకి వచ్చి ఒక శక్తిగా పనిచేశాయని ఆయన వివరించారు.

Advertisement

రాష్ట్రంలోని యువతను ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐఐటీ మద్రాస్, ఐబిఎం (IBM) వంటి సంస్థల భాగస్వామ్యంతో దాదాపు 45 లక్షల మంది యువతకు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెక్యూరిటీ, డీప్ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 1.04 లక్షల మంది విద్యార్థులు ఐఐటీ మద్రాస్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడం వారి ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ క్వాంటం కేంద్రాలు కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా, క్వాంటం హార్డ్‌వేర్ తయారీకి (Hardware Manufacturing) పునాది వేస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడకుండా, భారత్ తన సొంత క్వాంటం కంప్యూటర్లను నిర్మించుకునే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలో ఐబిఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు భవన నిర్మాణం జరుగుతోందని, ఈ ఏడాది చివరి నాటికి అది అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, డీఎస్టీ సెక్రటరీ అభయ్ కరందీకర్ తదితర ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Advertisement

Read Also: ఏఐకి గురువులుగా మారండి.. వేలల్లో సంపాదించండి.. టెక్ రంగంలో సరికొత్త ట్రెండ్

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×