E-Paper
Advertisement

Mobile Internet Tax: డిజిటల్ వినియోగదారులకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం!

Mobile Internet Tax: డిజిటల్ వినియోగదారులకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం!

Mobile Internet Tax: భారతదేశం ప్రస్తుతం డిజిటల్ విప్లవంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా లభించే దేశాలలో ఒకటిగా ఉండటంతో, ఇక్కడ ఇంటర్నెట్ వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. తాజా నివేదికల ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2025 (FY25) లో భారతీయులు ఏకంగా 229 బిలియన్ జీబీ డేటాను వినియోగించి రికార్డు సృష్టించారు. ఈ భారీ వినియోగాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Read also-Perplexity AI PC: మీ పర్సనల్ పనులకు కొత్త ఏఐ కంప్యూటర్ వచ్చేస్తోంది.. ఇక ఆ శ్రమ తగ్గినట్లే..

ప్రతిపాదన వెనుక..

ప్రభుత్వం ప్రస్తుతం మొబైల్ డేటా వినియోగంపై ఒక నిర్దిష్టమైన పన్ను విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఒకవేళ వినియోగించే ప్రతి 1 GB డేటాపై రూ.1 పన్ను విధిస్తే, అది ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. FY25 వినియోగ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటే, ఈ పద్ధతి ద్వారా సుమారు రూ.22,900 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 2026 నాటికి ప్రభుత్వం అధికారికంగా సమీక్షించే అవకాశం ఉందని సమాచారం.

ఈ పన్ను ఎందుకు?

డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 5G నెట్‌వర్క్ విస్తరణ, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం, సైబర్ భద్రతను బలోపేతం చేయడం వంటి పనులకు భారీ నిధులు అవసరం. టెలికామ్ కంపెనీలపై ఇప్పటికే స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర భారాలు ఉన్న నేపథ్యంలో, డేటా వినియోగంపై నేరుగా పన్ను విధించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Read also-Portable Washing Machines: రూ.1000 లోపే వాషింగ్ మెషీన్.. మడతపెట్టి ఎక్కడికైనా పట్టుకెళ్లిపోవచ్చు!

సామాన్యుడిపై భారం..

భారత్‌లో సగటు మొబైల్ వినియోగదారుడు నెలకు దాదాపు 20 నుండి 30 GB డేటాను వాడుతున్నారు. ఒకవేళ రూ.1 పన్ను అమల్లోకి వస్తే.. టెలికామ్ సంస్థలు (Jio, Airtel, Vi) ఈ పన్ను భారాన్ని వినియోగదారులపైనే వేస్తాయి. దీనివల్ల నెలవారీ రీఛార్జ్ ప్లాన్లు కనీసం రూ.20 నుండి రూ.50 వరకు పెరగవచ్చు. యూట్యూబ్, ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేసే మధ్యతరగతి, పేద ప్రజలపై ఇది అదనపు ఆర్థిక భారం అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలు చూసే వారికి డేటా ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఒకవైపు ‘డిజిటల్ ఇండియా’ను ప్రోత్సహిస్తూనే, మరోవైపు డేటాపై పన్ను విధించడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినప్పటికీ, సామాన్య ప్రజల జేబుకు చిల్లు పెట్టే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2026లో జరిగే సమీక్షలో ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అదే గనుక జరిగితే ఇండియాలో డేటా వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×