BigTV English
Advertisement

Scientist On Earth: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

Scientist On Earth: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

Earth Cooling: గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమిపై వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యంతో భూ గ్రహం ప్రతి ఏటా మరింత వేడెక్కుతున్నది. ఫలితంగా మంచు కరిగి నీరు భూమిని కబలిస్తోంది. రానున్న రోజుల్లో భూగ్రహం మరింత వేడెక్కే పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు, భూమి వేడిని తగ్గించే ప్రయత్నాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఓ మార్గాన్ని కనిపెట్టారు.


డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం

వాతావరణంలోకి డైమండ్ డస్ట్ ను ఇంజెక్ట్ చేయడం వల్ల భూ గ్రహాన్ని చల్లబరిచే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌ లో ప్రచురించబడిన కొత్త అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వజ్రాల ధూళి భూమిని కూల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వాతావరణ మార్పులకు కారణమయ్యే భూమి టిప్పింగ్ పాయింట్ కు డైమండ్ ధూళిని పంపించడం వల్ల భూగ్రహాన్ని చల్లబరిచే అవకాశం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు..


డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం!

వాతావరణ శాస్త్రవేత్తలు గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు ఉపయోగించే పలు రకాల ఏరోసోల్ లను పోల్చేందుకు లేటెస్ట్ 3D వాతావరణ నమూనాలను ఉపయోగిస్తోంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించాలని భావించినప్పటికీ, అది అనుకున్న స్థాయిలో ప్రభావం చూపే పరిస్థితి లేదని గుర్తించారు. సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని తగ్గించడంలో ఈ పద్దతి అనుకున్న ఫలితాలను ఇవ్వదని గుర్తించారు. కాల్సైట్, అల్యూమినియం, సిలికాన్ కార్బైడ్, సల్ఫర్ డయాక్సైడ్‌ తో సహా ఏడు వేర్వేరు పదార్థాలతో భూమిని చల్లబరిచేందుకు ప్రయత్నించారు.  వీటిన్నింటితో పోల్చితే డైమండ్ డస్ట్ ద్వారా భూమిని సమర్థవంతంగా చల్లబరిచే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. డైమండ్ కణాలు అత్యంత కాంతిని, వేడిని అడ్డుకోవడంలో ఎఫెక్టిక్ గా పని చేస్తాయని తెలుసుకున్నారు. డైమండ్ డస్ట్ ఇతర రసాయనాలతో పోల్చితే అంత ఈజీగా వాతావరణంలో కలిసిపోదని గుర్తించారు.

ఇది సాధ్యం అయ్యే పనేనా?

వాస్తవానికి సల్ఫర్ డయాక్సైడ్ లాంటి రసాయనాలతో భూమిని చల్లబర్చడం సాధ్యమేనా అని ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలు, లాభం కంటే నష్టమే ఎక్కువ కలిగే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ రసాయనాలను వాతావరణంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఆమ్ల వర్షాలు కురవడంతో పాటు ఓజోన్ పొర దెబ్బతినే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కానీ, వజ్రాల ధూళి రసాయన చర్యలకు లోను కాదని గుర్తించారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయదని తెలుసుకున్నారు. ఏటా 5 మిలియన్ టన్నుల సింథటిక్ డైమండ్ డస్ట్‌ ను వాతావరణంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల 45 సంవత్సరాలలో భూమిని 1.6 ° C వరకు చల్లబరిచే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రయోగం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఏకంగా 200 ట్రిలియన్ డాలర్లు అవసరం అవుతాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇది అయ్యేపని కాదని చాలా మంది భావిస్తున్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాలు పొందే దిశగా ప్రయోగాలు ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

Read Also: AI లేదు తొక్కాలేదు.. అదేంటీ యాపిల్ సీఈవో అంత మాట అనేశారు!

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×