E-Paper
Advertisement

Naga Vamshi : ఆ హీరోల పరువు అడ్డంగా తీసేసిన నిర్మాత.. నమ్మించి ముంచడం అంటే ఇదే..

Naga Vamshi : ఆ హీరోల పరువు అడ్డంగా తీసేసిన నిర్మాత.. నమ్మించి ముంచడం అంటే ఇదే..

Naga Vamshi : ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత, డిస్టిబ్యూటర్ సూర్యదేవర నాగ వంశీ ( Nagavamsi) ఈ మధ్య కోరి మరి వివాదాలు తెచ్చుకుంటున్నాడు. ఆయన ఏం మాట్లాడిన కూడా వివాదాలే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. మొన్న దేవర డిస్టిబ్యూటర్లకు దుబాయ్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న ‘1500 పెట్టి ఒక ఫ్యామిలీ సినిమా చూడలేరా? 3 గంటల ఎంటర్టైన్ ఎవ్వరూ ఇవ్వరు’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. సినిమా హిట్ అవుతున్నాయని ఓవర్ గా మాట్లాడుతున్నారని టాక్ ను అందుకున్నాడు. అయినా ఆ ధోరణి మార్చుకోలేదు. మరోసారి ఆయన నోటి దూలతో ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పించాడు. నమ్మించి దారుణంగా మోసం చేసాడనే టాక్ ను సొంతం చేసుకున్నాడు. అసలు మ్యాటరేంటో ఒకసారి తెలుసుకుందాం..

మలయాళ స్టార్ హీరో సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైన్ ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో నిర్మాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో వివాదాలను కూడా మూటగట్టుకున్నాడు.

అసలు విషయానికొస్తే.. ప్రముఖ నిర్మాత నాగ వంశీ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆయన చెప్పే మాటలు సినిమా పై ఆసక్తిని కలిగించిన కూడా కొన్ని సార్లు వివాదాలు కూడా కోరి తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన సంచలన విషయాలను బయట పెట్టాడు.. ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. దుబాయ్ ట్రిప్ గురించి ముందుగా మాట్లాడారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన నటుడు ఎవరు అని అడగ్గా నన్ను నిలబెట్టింది బన్నీ, కళ్యాణ్ లు కానీ నాకు పర్సనల్ గా తారక్ అంటే ఇష్టమని చెప్పడంతో ఆ హీరోల ఫ్యాన్స్ కోపంతో రగిలి పోతున్నారు. నమ్మించి నట్టేట ముంచేసారుగా నిర్మాత గారు అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నాయి. ఇక ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో చూడాలి..ఈ సినిమా అనే కాదు అంతకు ముందు వచ్చిన చాలా సినిమాల్లో ఇలాగే ఏదో ఒక స్పెషల్ కామెంట్ చేసి ఆయన హైలెట్ అయ్యారు. ప్రతి ఏరియాలోను రాజమౌళి కలెక్షన్స్ దగ్గరగా వెళ్తాం. నేను విన్న కంటెంట్ తీసిన కంటెంట్ ఏంటో నాకు తెలుసు కదా.. మేము మా మాట మీద ఉన్నాము. గుంటూరు కారం మూవీ రిలీజ్ ను మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ మీరు చూసుకోండి అంటూ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు.. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సినిమా రిలీజ్ కి ముందు హైలెట్ అవుతాడు, రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ బాధితుడు అవుతారు. మొత్తానికి ఇది హాట్ టాపిక్ అవుతుంది..

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×