Jio Recharge Plan: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన యూజర్ల కోసం మరో సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. నెలరోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్.. అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అపరిమిత కాల్స్, రోజూవారి అవసరాలకు తగ్గట్లు డేటా, ఉచిత ఎస్ఎంఎస్ లు.. ఈ ప్లాన్ కింద యూజర్లకు లభిస్తాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ ధర ఎంత? దాని వల్ల యూజర్లకు కలిగే లాభాలు? వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జియో తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.339గా నిర్ణయించింది. 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 GB డేటా యూజర్ కు లభిస్తుంది. అలాగే అపమిత కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. దీంతపాటు జియో టీవీ, జియో టీవీ ఏఐ క్లౌడ్ యాప్ సబ్ స్క్రిప్షన్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
రూ.339గా కింద మరో క్రేజీ ప్రయోజనాన్ని సైతం జియో ఆఫర్ చేస్తోంది. రూ.14.95 విలువైన టాక్ టైమ్ ను అందిస్తోంది. అయితే ప్లాన్ లో జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్రయోజనాలు లేకపోవడం గమనార్హం. అదే విధంగా 1.5GB రోజూవారీ డేటాతో వస్తున్నందున 5G సపోర్ట్ కూడా ఈ ప్లాన్ కు లభించదు. రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్స్ కు మాత్రమే జియో 5Gని అందిస్తోంది.
Also Read: జియోను నిలదీసిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకూ డెడ్ లైన్.. యూజర్లకు మాత్రం పండుగే!
రూ.399 ప్లాన్ ను 30 రోజుల వ్యాలిడిటీ వచ్చిన సంగతి తెలిసిందే. అంటే రోజుకు సగటున దాదాపు రూ.11 భారం మాత్రమే వినియోగదారుడిపై పడుతుంది. కాబట్టి బడ్జెట్ లో నెలవారీ ప్లాన్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ ప్లాన్ ను జియో వెబ్ సైట్ లేదా మై జియో యాప్ లోకి వెళ్లి రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ లోనూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.
Also Read: ఆఫ్రికన్ నమూనాతో.. దేశంలో ఎల్పీజీ సమస్యకు చెక్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?