E-Paper
Advertisement

Jio Safety Warnings: హైవేపై ప్రయాణిస్తున్నారా?.. ఇకపై JIO కొత్తగా ఇలా చేయనుంది!

Jio Safety Warnings: హైవేపై ప్రయాణిస్తున్నారా?.. ఇకపై JIO కొత్తగా ఇలా చేయనుంది!

Jio Safety Warnings: జాతీయ రహదారులపై ప్రయాణం సురక్షితంగా సాగేలా కొత్త మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రిలయన్స్ Jioతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, పొగమంచు, రోడ్లపైకి జంతువులు, సడెన్‌ డైవర్షన్స్‌ వంటి ప్రమాదకర మలుపుల సమాచారం ఇకపై ప్రయాణికుల ఫోన్ నెంబర్లకు నేరుగా పంపనున్నారు. అలాగే, దీనికోసం ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయనవసం లేదు. ఈ ప్రాసెస్ మొత్తం జియో 4జీ, 5జీ టెలికాం ఫెసిలిటీపై ఆధారపడి నడుస్తుంది. దీనిలో భాగంగా ప్రయాణికులు SMS, వాట్సప్, హై ప్రయారిటీ కాల్స్‌ ద్వారా ముందస్తు హెచ్చరికలు స్వీకరిస్తారు. దీంతో ప్రయాణికులు వాహన వేగాన్ని తగ్గించడంతో పాటు ప్రమాదకరమైన ప్రాంతాల్లో జాగ్రత్త పడతారు.

ఎలా పని చేస్తుందంటే:

నేష్నల్ హెవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మొదట ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను దేశంలోని నాలుగు-ఐదు హైవేలపై ప్రారంభించనున్నారు. వీటిలో ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, హర్యానా, ఒడిశాలోని కొన్ని హైవేలు ఉన్నాయి. ఈ ఫీచర్ కారు, బస్సు, ట్రక్ లేదా ఇతర వాహనాలను నడిపేవారికి ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: మెసేజింగ్ యాప్స్‌కు కేంద్రం ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

అమల్లోకి ఎప్పుడు?

జాతీయ రహదారి మీద ప్రయాణించే వాళ్లకి ఈ సేవ మరికొన్ని నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని కోసం ఇటీవలె NHAI రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద 4G, 5G నెట్‌వర్క్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు హైవేలపై ప్రయాణించేటప్పుడు ఎస్‌ఎంఎస్, వాట్సప్ సందేశాలు అందుతాయని తెలిపారు.

వాయిస్ మెసేజ్ కూడా..

ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో వాహనదారులకు SMS అందుతాయని భావిస్తున్నారు. ఆ తర్వాత వాట్సప్ సందేశాలు అందుబాటులోకి వస్తాయి. అయితే.. రాబోయే రోజుల్లో వాహనదారులు పదే పదే ఫోన్ చూడాల్సిన అవసరం లేకుండా వాయిస్ మెసేజ్‌లు కూడా అందుబాటులోకి వస్తాయని నేష్నల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

కలిగే ప్రయోజనాలివే:

కొత్తగా తీసుకురానున్న ఈ ఫీచర్ వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హైవేపై ప్రయాణిస్తున్న వారికి ఒకటి లేదా రెండు కిలోమీటర్ల ముందుగానే ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయనో లేదా దట్టమైన పొగమంచు ఏర్పడిందనో సమాచారం అందుతుంది. దీంతో పాటు ఏనుగులు లేదా ఇతర జంతువుల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కూడా NHAI నుంచి హెచ్చరికలు అందుతాయి.

Also Read: వాట్సాప్‌లో APK ఫైల్స్‌తో మిమ్మల్ని ఎలా దోచేస్తారో తెలుసా? ఈ వీడియో చూస్తే షాకే!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×