16GB RAM Phones End| అన్ని స్మార్ట్ఫోన్ బ్రాండ్స్ గత కొంతకాలంగా హై స్పీడ్ ర్యామ్ తో యూజర్లను ఆకర్షించాయి. ముఖ్యంగా 16GB RAM ఫోన్లకు చాలా డిమాండ్. ఈ డివైస్లు గేమర్లు, పవర్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. అయితే ఈ ట్రెండ్ త్వరలో నెమ్మదించవచ్చు. ఎందుకంటే అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు 16GB RAM ఫోన్లు తయారీని నిలిపివేయనున్నాయి. దీనికి ప్రధాన కారణం మెమరీ చిప్ ధరలు పెరగడం. బ్రాండ్లు స్మార్ట్ఫోన్ ధరలను కంట్రోల్ చేయాలని చూస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్లు ఖరీదైపోయాయి. సరఫరా పరిమితంగా ఉండటం వల్ల ధరలు పెరిగాయి. ఈ కొరత స్మార్ట్ఫోన్ తయారీదారులను బాగా ప్రభావితం చేసింది. RAM, స్టోరేజ్ చిప్లు ముందుకంటే ఇప్పుడు చాలా ఖరీదు. కంపెనీలు ఖర్చులు తగ్గించడానికి ఫోన్ స్పెసిఫికేషన్లు అడ్జస్ట్ చేస్తున్నాయి. తక్కువ RAMతో ఫోన్లు సరసమైనవిగా ఉంటాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇందులో పెద్ద పాత్ర పోషిస్తోంది. చిప్ తయారీదారులు AI సంబంధిత మెమరీ ప్రొడక్ట్స్పై దృష్టి పెడుతున్నారు. సామ్సంగ్, SK హైనిక్స్, మైక్రాన్ ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నాయి. వీరు డేటా సెంటర్ల కోసం హై-బ్యాండ్విడ్త్ మెమరీ చిప్లు తయారు చేస్తున్నారు. ఇవి అడ్వాన్స్డ్ AI వర్క్లోడ్స్ సపోర్ట్ చేస్తాయి. ఫలితంగా కన్స్యూమర్ మెమరీ చిప్ ప్రొడక్షన్ తగ్గింది.
కన్స్యూమర్ మెమరీ చిప్లు ముఖ్యంగా ఫోన్లు, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్లకు ఉపయోగపడతాయి. వీటి తయారీ తగ్గడం వల్ల సరఫరా కొరత ఏర్పడింది. చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ ఈ కన్స్యూమర్ మెమరీ చిప్లు పూర్తిగా ఆపేసిందని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్స్. కంపెనీ ఇప్పుడు AI-గ్రేడ్ మెమరీ సొల్యూషన్స్పై మాత్రమే దృష్టి పెడుతోంది. ఇది కన్స్యూమర్ మార్కెట్లో అందుబాటును తగ్గించింది. డిమాండ్ హైగా ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
రిపోర్ట్స్ ప్రకారం బ్రాండ్లు తక్కువ RAM ఆప్షన్లకు తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్లో 4GB RAM ఫోన్లు మళ్లీ కనిపించవచ్చు. మిడ్-రేంజ్ ఫోన్లు కూడా తగ్గిన RAMతోనే మార్పులతో రావొచ్చు. ఇది కంపోనెంట్ ఖర్చులను మేనేజ్ చేయడానికి సహాయపడుతుంది. అయినా పనితీరులో పెద్దగా మార్పు ఉండదని అంచనా. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్తో తక్కువ RAMను సపోర్ట్ చేయవచ్చు.
హై RAM ఫోన్లు పూర్తిగా అదృశ్యం కావు. ప్రీమియం మోడల్స్లో ఎక్కువ RAM ఇస్తారు. 16GB లేదా అంతకంటే ఎక్కువ RAM ఫ్లాగ్షిప్ డివైస్లకు ఎక్స్క్లూజివ్ ఎడిషన్స్ వస్తాయి. ఈ ఫోన్లు హెవీ మల్టీటాస్కింగ్ కావాల్సిన యూజర్లు, గేమర్లు, ప్రొఫెషనల్స్ను టార్గెట్ చేస్తాయి. అయితే ఇలాంటి మోడల్స్ ధర ఎక్కువ అవుతుంది.
మెమరీ ధరలు పెరగడం ఒక్క స్మార్ట్ఫోన్స్కే కాదు చాలా ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ను సైతం ప్రభావితం చేస్తాయి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు ఖరీదు అవుతాయి. ఈ కారణంగానే ఇండియాలో ధర పెంచుబోతున్నట్లు శామ్సంగ్ సూచించింది. చాలా ప్రొడక్ట్ కేటగిరీల్లో ధరలు పెరగవచ్చు. ల్యాప్టాప్ బ్రాండ్స్ కూడా ధరలు పెంచే అవకాశాలున్నాయి. డెల్ ల్యాప్టాప్ ధరలు 15-20 శాతం పెరగవచ్చని అంచనా.
Also Read: భీమ్ యుపిఐ స్పెషల్ ఆఫర్.. అందరికీ క్యాష్బ్యాక్.. త్వరపడండి
తయారీదారులు పనితీరు, తక్కువ ధరలో మధ్య బ్యాలెన్స్ చేయాలి. డివైస్లు కాంపిటిటివ్గా ఉంచాలని కోరుకుంటారు. RAM తగ్గించడం ఫైనల్ ధరను కంట్రోల్ చేస్తుంది. అయినా కస్టమర్లు స్మూత్ పనితీరు ఆశిస్తారు. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్పై ఆధారపడవచ్చు. ఎఫిషియెంట్ ప్రాసెసర్లు RAM డిపెండెన్సీ తగ్గిస్తాయి.
కస్టమర్లు హై-RAM ఫోన్లు తక్కువగా చూడవచ్చు. ఎంట్రీ-లెవల్ ఫోన్లు మళ్లీ 4GB RAMతో లాంచ్ అవుతాయి. మిడ్-రేంజ్ ఫోన్లు 6GB లేదా 8GB RAMకు పరిమితం అవుతాయి. ప్రీమియం ఫోన్లు హై RAM ఆప్షన్లు ఇస్తాయి. అన్ని కేటగిరీల్లో ధరలు క్రమంగా పెరగవచ్చు. హై-RAM ఆప్షన్లు చాలా వరకు తగ్గిపోతాయి.
స్మార్ట్ఫోన్ మార్కెట్ ట్రాన్సిషన్ ఫేజ్లోకి ప్రవేశిస్తోంది. AI డిమాండ్ గ్లోబల్ మెమరీ ఇండస్ట్రీని మార్చేస్తోంది. కన్స్యూమర్ డివైస్లు కంపోనెంట్ కొరతలు ఎదుర్కొంటున్నాయి. 16GB RAM ఫోన్లు కనిపించడం తగ్గిపోతాయి. తక్కువ RAM ఫోన్ల ధర సైతం పెరిగిపోతుంది. ప్రీమియం డివైస్లు కోరుకునే వారు అత్యధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది.