Realme P Series: ప్రముఖ స్మార్ట్పోన్ల తయారీ సంస్థ రియల్మీ నుంచి మరో పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానున్నట్టు లీక్స్ చెబుతున్నాయి. గత ఏడాదిలో విడుదలైన Realme P4x 5G తర్వాత, అదే P సిరీస్లో కొత్త మోడల్ను ఈ నెల చివర్లో లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతున్నట్టు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) వెబ్సైట్లో దర్శనమిచ్చింది. ప్రముఖ టిప్స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. RMX5107 మోడల్ నంబర్తో ఉన్న ఈ రియల్మీ స్మార్ట్ఫోన్ BIS సర్టిఫికేషన్ను పొందింది. సాధారణంగా BIS అనుమతి లభించిందంటే.. త్వరలోనే భారత్లో లాంచ్ అవుతుందనడానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఈ ఫోన్ జనవరి చివర్లోనే భారత్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
Also Read: నీటిలో మునిగిపోయినా ఏం ఫర్లేదు.. మార్కెట్ను షేక్ చేయనున్న వాటర్ప్రూఫ్ మొబైల్స్ ఇవే!
ఈ హ్యాండ్సెట్కు సంబంధించిన తాజా లీకులు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో భారీ 10,000mAh బ్యాటరీ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది నిజమైతే, ఇప్పటివరకు భారత్లో రియల్మీ విడుదల చేసిన స్మార్ట్ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అవుతుంది. అయితే ఈ విషయంపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సాఫ్ట్వేర్ పరంగా చూస్తే.. ఈ కొత్త Realme P సిరీస్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించిన Realme UI 7.0తో పనిచేయవచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే పనితీరు కోసం 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉండే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ఇకపోతే ఈ ఫోన్ ధర గత ఏడాది విడుదలైన Realme P4x 5G కంటే.. కొంచెం ఎక్కువ ధరలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. Realme P4x 5Gను రూ.15,499 ప్రారంభ ధరతో విడుదల చేశారు. ఆ మోడల్లో 7,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6nm టెక్నాలజీపై తయారైన MediaTek Dimensity 7400 Ultra చిప్సెట్ ఉన్నాయి. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా అందించారు.
ఇటీవల విడుదలైన ఈ కొత్త లీకులు నిజమైతే.. రాబోయే Realme P సిరీస్ ఫోన్ బ్యాటరీ బ్యాక్అప్ విషయంలో కొత్త బెంచ్మార్క్ సెట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు కంపెనీ నుంచి అధికారిక విడదుల అనౌన్స్మెంట్ కోసం టెక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.