E-Paper
Advertisement

ఫ్రిడ్జ్‌లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!

ఫ్రిడ్జ్‌లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!
Advertisement

Rs 1 Coin Trick: సాధారణంగా ప్రతీ ఒక్కరు ఏదోక టైమ్ లో లాంగ్ ట్రిప్ లేదా ఊర్లకు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి, లైట్లు, ఫ్యాన్లు అన్ని బంద్ చేస్తుంటారు. అయితే ఫ్రిడ్జ్ లో ఉండే ఆహారాపదార్థాలు పాడవకుండా.. దానిని మాత్రం ఆన్ లోనే ఉంచి ప్రయాణాలకు బయలుదేరుతారు. అయితే తిరిగి వచ్చాక చాలా సందర్భాల్లో ఫ్రిడ్జ్ లోని ఆహారపదార్థాలు పాడవటం జరుగుతుంటుంది. అయితే ఆహారం చల్లగా ఉండటం వల్ల ఇది గమనించకుండానే చాలా మంది ఆ ఫుడ్ ను తిని అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే ఈ సమస్యకు రూ.1 కాయిన్ తో చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అది ఎలాగో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రూ.1 కాయిన్ ట్రిక్ ఎలా చేయాలి?

నిపుణుల సూచన ప్రకారం ఈ చిట్కాను ఫాలో అవ్వడం చాలా సింపుల్. ఇందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇందులో భాగంగా మొదట ఒక గ్లాసు లేదా ప్లాస్టిక్ కప్పులో నీళ్లు పోసి దాన్ని ఫ్రీజర్‌లో పెట్టి పూర్తిగా గడ్డకట్టేలా (ఐస్ అయ్యేలా) చేయాలి. ఆ నీరు గడ్డకట్టిన తర్వాత ఆ ఐస్ ముక్కపై ఒక రూపాయి నాణేన్ని (Rs 1 Coin) పెట్టాలి. ఇప్పుడు ఆ గ్లాసును అలాగే ఫ్రీజర్‌లో ఉంచి.. ఊరికి వెళితే సరిపోతుంది.

తిరిగి వచ్చాక ఏమవుతుంది?

Advertisement

ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రీజర్‌ తెరిచి ఆ గ్లాసును పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణెం యథావిధిగా ఐస్ పైనే ఉంటే మీరు లేని సమయంలో కరెంట్ పోలేదని అర్థం. ఫ్రీజర్‌లోని ఆహారం సురక్షితంగా ఉందని దాన్ని నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ నాణెం మధ్యలోకి లేదా కిందకు వెళ్తే.. మీరు ఊరిలో లేనప్పుడు చాలా గంటల పాటు కరెంట్ పోయిందని అర్థం చేసుకోవాలి. కరెంట్ పోవడం వల్ల ఐస్ కరిగి, నాణెం కిందికి మునిగిపోయిందన గుర్తించాలి. ఆ తర్వాత మళ్లీ కరెంట్ వచ్చాక నీరు ఐస్‌లా గడ్డకట్టిందని తెలుసుకోవాలి. దీని ప్రకారం ఫ్రీజర్‌లోని ఆహారం ఆల్రెడీ పాడైపోయి మళ్లీ గడ్డకట్టిందని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఎక్కవ కాలం జీవించాలంటే అన్నీ తినండి ఈ 3 తప్ప.. లేకుంటే చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు

రూ.1 నాణెం చిట్కా పాటించకపోతే..!

Advertisement

కరెంట్ ఎక్కువసేపు పోయినప్పుడు ఫ్రీజర్‌లోని మాంసం, పాలు, వండిన పదార్థాలలో బ్యాక్టీరియా చేరి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. మళ్లీ కరెంట్ వచ్చాక అవి మామూలుగానే కనిపిస్తాయి కానీ వాటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కేవలం ఒక రూపాయి నాణెంతో ఆరోగ్యానికి వచ్చే పెద్ద ముప్పును కనిపెట్టవచ్చని పేర్కొంటున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయాలని హితవు పలుకుతున్నారు.

Also Read: యానిమల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అయ్యో అంత బాధపడిందా..?

Related News

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×