Airtel Clarifies: ఎయిర్టెల్ తమ అన్లిమిటెడ్ 5G డేటా ప్లాన్లలో హాట్స్పాట్ ద్వారా డేటా షేరింగ్ను బ్లాక్ చేసిందంటూ గత 2, 3 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో యూజర్లలో గందరగోళం ఏర్పడింది. ఇది నిజమా? కాదా? అన్న కన్ఫ్యూజన్ లో ఎయిర్ టెల్ యూజర్లు పడిపోయారు. ఈ నేపథ్యంలో సదరు టెలికాం సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమిత 5G డేటాను అర్హులైన యూజర్లు వాడుకోవచ్చని స్పష్టం చేసింది.
ఎయిర్ టెల్ 5G టర్మ్స్ అండ్ కండిషన్స్ లోని ఓ నిబంధనను తీసుకొచ్చి 5G అపరిమిత సేవలకు ఆపాదించారని ఎయిర్ టెల్ పేర్కొంది. ఆ నిబంధనకు సంబంధించి నెట్టింట పోస్ట్ చేసిన ఓ స్క్రీన్ షాట్.. ఈ గందరగోళానికి దారితీసినట్లు ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొన్నాయి. సదరు నిబంధన.. హాట్ స్పాట్ ద్వారా డేటా షేరింగ్ కు ఏమాత్రం వర్తించదని.. యూజర్లు గందరగోళానికి గురికావాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఎయిర్ టెల్ అధికారికంగా వెల్లడించింది. దీంతో గత రెండ్రోజులుగా జరుగుతున్న ఫేక్ ప్రచారానికి ఎయిర్ టెల్ చెక్ పెట్టినట్లైంది. అటు యూజర్లు సైతం ఎయిర్ టెల్ ఇచ్చిన క్లారిటీతో ఊపిరిపీల్చుకుంటున్నారు.
Also Read: ఇన్స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!
వాస్తవానికి ఫేక్ ప్రచారం జరుగుతున్న సమయంలోనూ ఎయిర్ టెల్ యూజర్లు.. 5G నెట్ వర్క్ ను హాట్ స్పాట్ ద్వారా షేర్ చేసుకున్నారు. ల్యాప్ టాప్, టాబ్లెట్లు, ఇతర మెుబైల్స్ ను హాట్ స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకున్నారు. 5G వాడకం విషయంలో ఎలాంటి అవాంతరాలను ఎదుర్కొలేదని పలువురు ఎయిర్ టెల్ యూజర్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు వివాదం తలెత్తిన తర్వాత ఎయిర్టెల్ తన అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్ నిబంధనల నుంచి ఆ నిర్దిష్ట హాట్స్పాట్ క్లాజ్ను తొలగించింది. కాబట్టి ఈ ప్రచారానికి ముందు హాట్ స్పాట్ ఎలా పనిచేసిందో.. ఇకమీదట కూడా అలాగే డేటా షేరింగ్ ను ఎయిర్ టెల్ అనుమతిస్తుందని చెప్పవచ్చు.
Also Read: పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!