E-Paper
Advertisement

UPI in Post Offices: గుడ్ న్యూస్.. ఇకపై పోస్టాఫీసుల్లోనూ.. యూపీఐ పేమెంట్స్

UPI in Post Offices: గుడ్ న్యూస్.. ఇకపై పోస్టాఫీసుల్లోనూ.. యూపీఐ పేమెంట్స్
Advertisement

UPI in Post Offices: నేటి కాలంలో ఎక్కడికి వెళ్లినా ఫోన్ తోనే పని.. డబ్బులు ఎవరు వెంట తీసుకెళ్లడం లేదు. ఫోన్‌తో స్కాన్ చేసి డబ్బులు చెల్లించడం అలవాటు అయిపోయింది. ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు ఫోన్లలోనే స్కాన్ చేసే డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ పోస్టాఫీసుల్లో అలా కుదిరేది కాదు. తప్పనిసరిగా నగదు మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో, ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు.. భారత పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 32 ప్రధాన, 689 సబ్, 5,006 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై వినియోగదారులు.. తమ మొబైల్ ఫోన్‌ ఉపయోగించి స్కాన్ చేసి.. కేవలం కొన్ని సెకన్లలో చెల్లింపులు చేయవచ్చు. ఇక పొత్తికాగితాలు, క్యూలైన్లు, నిలబడాల్సిన అవసరం లేదు. ఈ సేవలను ఆగస్టు నెల నుండి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని పోస్టల్ శాఖ యోచిస్తోంది.

Advertisement

పాత విధానాల నుంచి ఆధునికీకరణ వైపు
పోస్టాఫీసులు గతంలో నుంచి సామాన్య ప్రజలకు.. నిత్యసేవల కేంద్రంగా నిలిచాయి. అయితే నగదు వినియోగం ఆధారిత వ్యవస్థ వల్ల.. చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. నగదు చెల్లింపులలో జాప్యం, చిల్లర కొరత, సెక్యూరిటీ సమస్యలు లాంటి వాటితో అధికారులు, కస్టమర్లు ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు యూపీఐ చెల్లింపులతో ఆ సమస్యలకు చెక్ పడనుంది.

భవిష్యత్ పోస్ట్ ఆఫీసు.. టెక్నాలజీతో ముందుకు
ఈ నిర్ణయం కేవలం చెల్లింపులు సులభతరం చేయడమే కాకుండా, పోస్టాఫీసులను ఆధునికీకరించడానికి తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. చిన్న గ్రామాల్లో కూడా ప్రజలు డిజిటల్ చెల్లింపులపై.. అవగాహన కలిగి ఉండేలా చేయడం, వారి బ్యాంకింగ్ సామర్థ్యాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

Advertisement

ప్రజల స్పందన: సంతోషం వ్యక్తం
ఇప్పటికే ఈ సేవలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి రావడంతో.. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం నగదు తీయడానికి ఎటువంటి ఎటిఎం వెతికేవాళ్లం. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులోనే యూపీఐ అందుబాటులో ఉండటంతో.. చాలా సౌకర్యంగా ఉందని పలువురు చెబుతున్నారు.

Also Read: స్మార్ట్ పోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్‌‌.. ఆ ఐదు ఫీచర్స్ తెలుసా? అయితే ఇదిగో..

ఈ నిర్ణయం వల్ల పోస్టాఫీసులు కేవలం లెటర్లు పంపే కేంద్రాలుగా కాకుండా, ఆధునిక ఫైనాన్షియల్ సర్వీస్ హబ్‌లుగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల విస్తరణకు.. ఇది ప్రోత్సాహకంగా మారనుంది.

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×