Xiaomi 17T Pro: కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ తన పవర్ఫుల్ T సిరీస్లో భాగంగా మార్చి నెలలో భారత మార్కెట్లోకి Xiaomi 17T Proను విడుదల చేయనున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది వచ్చిన షావోమీ 15T ప్రోకి ఇది అప్గ్రేడ్గా ఉండబోతోంది. ముఖ్యంగా చైనాలో పాపులరైన Redmi K90 Ultra మోడల్ను రీబ్రాండ్ చేసి మన ముందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం.
ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. దీని ఆడియో సెటప్. సాధారణంగా స్మార్ట్ఫోనుల్లో రెండు స్పీకర్లు ఉండటం చూస్తుంటాం. కానీ షావోమీ మరో అడుగు ముందుకేసి ఏకంగా 3 స్పీకర్లను పరిచయం చేస్తోంది. ప్రముఖ ఆడియో బ్రాండ్ BOSE సహకారంతో ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఫోన్ వెనుక భాగంలోని కెమెరా ఐలాండ్లో ఒక స్పెషల్ స్పీకర్ను సీక్రెట్గా అమర్చడం విశేషం. దీంతో సినిమా చూసినా, పాటలు విన్నా థియేటర్ ఫీల్ కలుగుతుంది.
Also Read: వివో నుంచి కేక పుట్టించేలా ‘ప్యాషన్ రెడ్’ వేరియంట్.. ఈ ఫోన్ స్టైల్ చూస్తే చూపు తిప్పుకోలేరు!
ఈ Xiaomi 17T Pro ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్ను ఉపయోగించనున్నారు. తద్వారా గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్గా సాగిపోతుంది. మరో విశేషం ఏమిటంటే.. దీనిలో ఏకంగా 8,500mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీంతో ఈ మొబైల్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు మూడు రోజుల వరకు ఛార్జింగ్ టెన్షన్ ఉండదు. అలాగే ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది.
ఇకపోతే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఈ ఫోన్లో అమర్చారు. అలాగే ఫోన్ మన్నిక కోసం IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. iaomi 17T Pro ధర విషయానికి వస్తే.. గత మోడల్ ధర రూ.77,000 ఉండగా, ఈ కొత్త ఫీచర్ల వల్ల Xiaomi 17T Pro ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read: రూ.13 వేలకే శాంసంగ్ 5G ఫోన్.. లెదర్ ఫినిష్ లుక్తో గెలాక్సీ F70e భారత్లో లాంచ్!