E-Paper
Advertisement

మ‌ళ్లీ ఛాన్స్ రాదు..ఇప్పుడే టీమిండియాను పాకిస్తాన్ ఓడించాలి

మ‌ళ్లీ ఛాన్స్ రాదు..ఇప్పుడే టీమిండియాను పాకిస్తాన్ ఓడించాలి
Advertisement

Basit Ali:  టీమిండియా వరుసగా ఓటములు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయిన తర్వాత ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్ చేతిలో 3-0 సిరీస్ కోల్పోయింది. ఇక టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య శనివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో కూడా టీమిండియా ఓడిపోతే వైట్ వాచ్ తప్పదు. ఈ క్రమంలో టీమిండియా జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ (basit ali) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉందని.. ఇప్పుడే పాకిస్తాన్ దెబ్బ కొట్టారని పిలుపునిచ్చారు. ఇప్పుడు తప్ప టీమ్ ఇండియాను మళ్ళీ ఎప్పుడు ఓడించలేమని.. వాళ్లను ఓడించేందుకు సిద్ధం కావాలని పాకిస్తాన్ జట్టుకు దిశా నిర్దేశం చేశారు దిశా నిర్దేశం చేశారు. దెబ్బ కొడితే.. టీమిండియా కు అబ్బా యాదికి రావాలి అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

మ‌ళ్లీ ఛాన్స్ రాదు..ఇప్పుడే టీమిండియాను పాకిస్తాన్ ఓడించాలి

Advertisement

ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా టీమిండియా ఆటగాళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయిందని బాంబు పేల్చారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ లాంటి బలమైన కెప్టెన్ ను వదులుకొని బీసీసీఐ తప్పు చేసిందన్నారు. ఈ దెబ్బకు టీమిండియా పతనం షురూ అయినట్లు వ్యాఖ్యానించారు. దానికి తోడు ఐపీఎల్ టోర్నమెంటులో ఫ్లాట్ మైదానాలు ఏర్పాటు చేసి బీసీసీఐ… మరో తప్పిదం చేసినట్లు వివరించారు.

బీసీసీఐ చేసిన తప్పిదాలు.. ఇప్పుడు టీమిండియాను వేధిస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. హైవే ఇలాంటి మైదానాలపై రెండు నెలలపాటు టీం ఇండియా ప్లేయర్లను ఆడించిన బీసీసీఐ.. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే విదేశీ మైదానంలో ఆడిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ఇప్పుడు గనుక పాకిస్తాన్ తో టీమిండియా ఆడితే… కచ్చితంగా ఓడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు వినియోగించుకోవాలని కోరారు. అతి త్వరలోనే ఏసియన్ గేమ్స్ 2026 రాబోతుందని అందులో టీమిండియాను ఓడించాలని పాకిస్తాన్ క్రికెటర్లకు పిలుపునిచ్చారు. 2027 ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ లో కూడా టీమిండియాను ఓడించాల్సిన బాధ్యత పాకిస్తాన్ పైన ఉందన్నారు.

Advertisement

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

Related News

న‌న్ను రాళ్ల‌తో కొట్టి, చంపినా…ఇంగ్లండ్ పై పాకిస్తాన్ గెల‌వ‌దనే చెబుతా

స‌చిన్ కు బౌలింగ్ వేసేట‌ప్పుడు గుండెపోటు వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ్డా

గంగూలీ అంటేనే నాకు చిరాకు, కానీ PCB చేయ‌లేని సాయం చేశాడు !

బాబ‌ర్ చుట్టూ చెత్త నా కొడుకులు ఉన్నారు..లేక‌పోతే మ‌రో ధోని అయ్యేవాడు

ధోని ఓ అగ్ని ప‌ర్వ‌తం..5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్ చేశాడు, సెహ్వాగ్ సంచ‌ల‌నం

టీమిండియా జెర్సీని తీసేసి, రౌడీల్లా త‌న్నుకోండి..జైస్వాల్ పై స‌బా క‌రీమ్ ఫైర్‌

బుమ్రా, షాహిన్ అఫ్రిది ఇద్ద‌రూ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే !

ఇక‌పై టెస్టుల‌ను 4 రోజుల‌కే కుదించాలి..ఐసీసీకి సంచ‌ల‌న లేఖ‌!

Big Stories

Advertisement
×