E-Paper
Advertisement

ఐసీసీతో కుమ్మ‌క్కు..అందుకే టీమిండియాకు మూడు ట్రోఫీలు..ఫ్లాట్ పిచ్ లు రెడీ చేసి కుట్ర‌లు!

ఐసీసీతో కుమ్మ‌క్కు..అందుకే టీమిండియాకు మూడు ట్రోఫీలు..ఫ్లాట్ పిచ్ లు రెడీ చేసి కుట్ర‌లు!
Advertisement

Ian Botham Trolling Indian Team:  టీమిండియా వరుసగా విదేశీ గడ్డలపై రెండు సిరీస్ లు ఓడిపోయింది. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయింది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య శనివారం చిట్ట చివరి టీ20 జరగనుంది. ఇందులో కూడా టీమిండియా ఓడిపోతే ఇంగ్లాండ్ చేతిలో కూడా వైట్ వాష్ అవుతుంది టీమిండియా. ఈ క్రమంలో టీమిండియా పై దారుణంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. విదేశీ మైదానాలలో టీమిండియా కు అస్సలు ఆడరాదంటూ హేళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బోథమ్ (Ian Botham) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఈ మధ్య కాలంలో వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిందని.. దానికి కారణం ఫ్లాట్ మైదానాలు అంటూ బాంబు పేల్చారు. టీమిండియాకు అనుకూలంగా ఐసీసీ, ఫ్లాట్ మైదానాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే… అవలీలగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు. లేకపోతే టీమిండియా ఒక్క ట్రోఫీ గెలిచేది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు ఇయాన్ బోథమ్. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

ఐసీసీతో కుమ్మ‌క్కు..అందుకే టీమిండియాకు మూడు ట్రోఫీలు

Advertisement

టీమిండియా గత మూడేళ్లలో వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ గెలుచుకుంది. ఇక 2025 లో ఛాంపియన్ ట్రోఫీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో దక్కించుకుంది. ఇక మూడు నెలల కిందట టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లో టీమిండియా దక్కించుకుంది. ఇలా 2024 నుంచి 2026 వరకు… సంవత్సరానికో ఐసీసీ ట్రోఫీ దక్కించుకుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. రెండు వారాల్లో రెండు సిరీస్ లు కోల్పోయింది. విదేశీ గడ్డలపై రాణించలేక చతికల పడింది.

ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు అనుకూలంగా 2024 నుంచి 2026 టీ20 ప్రపంచ కప్ వరకు ప్లాట్ మైదానాలను ఐసీసీ సిద్ధం చేసిందని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా మూడు ట్రోఫీలు దక్కించుకుందని బాంబు పేల్చారు. లేకపోతే టీమిండియా కు ఒక్క ట్రోఫీ దక్కేది కాదని విమర్శలు చేశారు. దీనికి నిదర్శనమే ఐర్లాండ్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక సిరీస్ లు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై అంతర్జాతీయ వేదికల్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీమిండియా ఇలాగే ట్రోఫీలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుందని బాంబు పేల్చారు.

Advertisement

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

Related News

న‌న్ను రాళ్ల‌తో కొట్టి, చంపినా…ఇంగ్లండ్ పై పాకిస్తాన్ గెల‌వ‌దనే చెబుతా

స‌చిన్ కు బౌలింగ్ వేసేట‌ప్పుడు గుండెపోటు వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ్డా

గంగూలీ అంటేనే నాకు చిరాకు, కానీ PCB చేయ‌లేని సాయం చేశాడు !

బాబ‌ర్ చుట్టూ చెత్త నా కొడుకులు ఉన్నారు..లేక‌పోతే మ‌రో ధోని అయ్యేవాడు

ధోని ఓ అగ్ని ప‌ర్వ‌తం..5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్ చేశాడు, సెహ్వాగ్ సంచ‌ల‌నం

టీమిండియా జెర్సీని తీసేసి, రౌడీల్లా త‌న్నుకోండి..జైస్వాల్ పై స‌బా క‌రీమ్ ఫైర్‌

బుమ్రా, షాహిన్ అఫ్రిది ఇద్ద‌రూ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే !

ఇక‌పై టెస్టుల‌ను 4 రోజుల‌కే కుదించాలి..ఐసీసీకి సంచ‌ల‌న లేఖ‌!

Big Stories

Advertisement
×