BigTV English

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : ఆసియా క‌ప్ 2025లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. గ్రూపు ద‌శ‌లో పాకిస్తాన్ జ‌ట్టును భార‌త జ‌ట్టు చిత్తు చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఇవాల సూప‌ర్ 4 మ్యాచ్ జ‌రుగుతుంది. అయితే ఈ మ్యాచ్ పై ర‌క‌ర‌కాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో తాజాగా భార‌త మాజీ వికెట్ కీప‌ర్ దీప్ దాస్ గుప్త టీమిండియా ఆట‌గాళ్ల‌కు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా భార‌త జ‌ట్టు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించాడు. పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌స్తుతం అంత‌గా ఫామ్ లో లేక‌పోయినా వారిని త‌క్కువ అంచ‌నా వేయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మ‌రోవైపు టీమిండియా ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగాల‌నే విష‌యాన్ని ఆయ‌న స్పందించారు. ప్ర‌స్తుతం దీప్ దాస్ గుప్త చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.


Also Read : IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

వారిద్ద‌రూ ఎంట్రీ..!

మ‌రో వైపు ఒమ‌న్ తో జ‌రిగిన మ్యాచ్ లో అయితే టీమిండియా కీల‌క బౌల‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, వ‌రుణ్‌ చ‌క్ర‌వ‌ర్తిలకు రెస్ట్ ఇచ్చారు. ఇవాళ పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ కి వారు అందుబాటులోకి రానున్నారు. మొన్న ఒమ‌న్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ త‌ల‌కు దెబ్బ త‌గిలిన అక్ష‌ర్ ప‌టేల్ ఆడ‌టం ఇప్పుడు సందేహంగానే ఉంది. అయితే అత‌ని స్థానంలో అర్ష్ దీప్, హ‌ర్షిత్ రాణాల‌లో ఒక‌రు త‌మ స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌చ్చు. భార‌త్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండ‌టంతో రెండు మ్యాచ్ ల్లో త‌ల‌ప‌డాల్సి వ‌చ్చింది. అయితే 2018లో కూడా అలాగే జ‌రిగింది. కాక‌పోతే వ‌న్డే ఫార్మాట్ లో జ‌రిగింది ఆసియా క‌ప్. 2018లో లీగ్ ద‌శ‌లో 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన టీమిండియా.. సూప‌ర్ 4 లో కూడా ఏక‌ప‌క్షంగా సాగిన మ్యాచ్ లో విజ‌యం సాధించింది. ఫైన‌ల్ లో టీమిండియా 2018లో బంగ్లాదేశ్ ను ఓడించి ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈ ఏడాది కూడా అలాంటి సీనే జ‌రుగ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే సూప‌ర్ 4లో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ లో విజ‌యం సాధించింది.


టీమిండియా హిస్ట‌రీ రిపీట్ అవుతుందా..?

మ‌రోవైపు టీ-20 ఫార్మాట్ లో 2022లో ఆసియా క‌ప్ జ‌రిగింది. భార‌త్ ఇది క‌లిసి రాలేదు. ఫైన‌ల్ కి చేరుకోవ‌డంలో విఫ‌లం చెందింది. గ్రూపు ద‌శ‌లో పాకిస్తాన్ ని ఓడించిన‌ప్ప‌టికీ సూప‌ర్ 4 స్టేజ్ లో మాత్రం భార‌త్ కి ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. చివ‌రి వ‌ర‌కు సాగిన ఈ మ్యాచ్ లో పాక్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తుది పోరుకు పాక్, శ్రీలంక వెళ్లాయి. శ్రీలంక విజేత‌గా నిలిచింది. 2023లో వ‌న్డే ఫార్మాట్ లో ఆసియా క‌ప్ జ‌రిగితే.. అది వ‌న్డే ఫార్మాట్ కావ‌డం టీమిండియానే విజ‌యం సాధించ‌డం విశేషం. ప్ర‌స్తుతం జ‌రిగే మ్యాచ్ ఏ సంవ‌త్స‌రం హిస్ట‌రీ రిపీట్ అవుతుందోన‌ని ఆస‌క్తి నెల‌కొన‌డం విశేషం.

Related News

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

IND Vs PAK : టీమిండియాతో మ్యాచ్‌..సైకాల‌జిస్ట్ ను రంగంలోకి దించుతోన్న పాక్‌

Watch Video : డాల్ఫిన్స్ కు కూడా రొనాల్డో తెలుసా… ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

IND Vs PAK : నేడు పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా మ్యాచ్.. “నో షేక్ హ్యాండ్” త‌రువాత మ‌రో స‌మ‌రం

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Big Stories

×