Commonwealth Games 2026 : కామన్వెల్త్లో భారత్కు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఫైనల్లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోను 5-0 తేడాతో చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచే వరుస పంచ్లతో విరుచుకుపడింది. ఐదుగురు జడ్జీలూ ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా ప్రకటించారు. 22 ఏళ్ల ప్రీతి… గతంలో ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !
మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా భారత్కు మరో స్వర్ణం సాధించింది. ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన మైఖేలా వాల్ష్పై 5-0 తేడాతో గెలిచింది. జైస్మిన్ గెలిచాక ఆమె ప్రత్యర్థి వాల్ష్ చేతిని పైకి ఎత్తి… క్రీడాస్ఫూర్తిని గౌరవించింది.
పురుషుల 55 కేజీల బాక్సింగ్లో జాదుమణి సింగ్ ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ జై డిక్సన్ చేతిలో ఓటమి పాలై.. సిల్వర్ మెడల్ కన్ఫామ్ చేసుకున్నాడు. అటు అథ్లెటిక్స్ ట్రాక్లోనూ భారత్ మెడల్స్ వర్షం కురిపించింది. పురుషుల షాట్పుట్ ఎఫ్-57 విభాగంలో సోమన్ రానా గోల్డ్ సాధించారు. శుభమ్ 13.28 మీటర్లతో సిల్వర్తో.. భారత్కు వన్-టూ ఫినిష్ అందించాడు. పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావెల్ 16.58 మీటర్లు దూకి సిల్వర్ మెడల్ సాధించాడు. సెల్వ ప్రభు తిరుమరన్ 16.52 మీటర్లతో కాంస్యం కైవసం చేసుకున్నాడు.