Devajit Saikia -Mohsin Naqvi Meeting: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) ఫైనల్స్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్స్ టీమిండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో విజయం సాధించిన ఉమెన్స్ టీమ్ ఇండియా, ఎనిమిదో సారి ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే టైటిల్ గెలిచిన టీమ్ ఇండియా ఎప్పటిలాగే… ట్రోఫీ లేకుండానే వెనుతిరిగింది. ఇలాంటి క్రమంలో బీసీసీఐ అధికారులపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. మొహ్సిన్ నఖ్వీ (ACC Chair Mohsin Naqvi ) లాంటి పాకిస్తాన్ కుక్కతో.. బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) సమావేశం కావడంపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను వైరల్ చేసి… బీసీసీఐపై మండిపడుతున్నారు క్రికెట్ అభిమానులు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా ACC చైర్మన్ పదవిలో ఉన్న మొహ్సిన్ నఖ్వీతో బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా సమావేశం కావడం వివాదంగా మారింది. అయితే దీనిపై అర్ధరాత్రి ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు దేవజిత్ సైకియా. ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను కలిశారు.. సమావేశమైన తర్వాత కాసేపు ముచ్చటించి వెళ్లిపోయారని వివరించారు. మ్యాచ్ సమయంలో తన పక్కన ఒకరు కూర్చున్నారని.. ఆ తర్వాత రాజీవ్ శుక్లా వచ్చి కూర్చున్నారని వివరించే ప్రయత్నం చేశారు.
అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో పాటు డిప్యూటీ చైర్మన్ ఖలీల్ సాహీబ్ కూడా తన వద్దకు వచ్చి కూర్చున్నారని.. వెల్లడించారు. నేను వెళ్లి వాళ్లను కలవలేదు.. వాళ్లే వచ్చి తనతో మీట్ అయ్యారని వ్యాఖ్యానించారు. అలా వచ్చినప్పుడు, ముఖం మీదే ఛీ కొట్టలేము కదా? అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చాడు కదా ? అని మాట్లాడాను తప్ప.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా ఈ అంశాన్ని వివాదం చేయకండి అని కోరారు. ఇలాంటి అంతర్జాతీయ మ్యాచ్ ఇలా సమయంలో వివిధ క్రికెట్ బోర్డుల ప్రతినిధులు ఒకరిని ఒకరు కలవడం, సమావేశం కావడం సాధారణమే అని వెల్లడించారు దేవజిత్ సైకియా.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా మహిళల జట్టు.. సూర్య కుమార్ యాదవ్ సేనను ఫాలో అయింది. పాకిస్తాన్ కుక్క మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టం లేక… బీసీసీఐ ఆదేశాల మేరకు ట్రోఫీ తీసుకోకుండానే ఇండియాకు తిరిగి వచ్చేస్తోంది. ట్రోఫీ ఇచ్చేందుకు మొహ్సిన్ నఖ్వీ సిద్ధంగా ఉన్నప్పటికీ… ముఖం మీదే ఛీ కొట్టింది టీమిండియా. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.