Irfan Pathan On Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు ఇర్ఫాన్ పఠాన్. పొద్దున లేస్తే, పాకిస్తాన్ వాడి కంటే ఎక్కువ ధోనిపై ఇర్ఫాన్ పఠాన్ పగ తీర్చుకుంటున్నాడు. ధోనిని విలన్ చేస్తూ నిత్యం మాట్లాడుతున్నాడు. అయితే లేటెస్ట్ గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ… మళ్లీ ధోనీని మధ్యలోకి లాగాడు. పాకిస్తాన్ జట్టుపై టీమిండియాను గెలిపించేందుకు తనను పావులా మహేంద్రసింగ్ ధోని వాడుకున్నాడని ఇర్ఫాన్ పఠాన్ బాంబు పేల్చారు. తనకు అవసరమైనప్పుడు బౌలింగ్ కు తనను దించేవాడన్నారు. దానికి తగ్గట్టుగా తాను రాణించి వికెట్లు పడగొట్టే వాడినని వెల్లడించారు. దీంతో ధోనిపై ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2007 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజ్ తో పాటు ఫైనల్స్ లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఈ టోర్నమెంట్ లో మహేంద్రసింగ్ ధోని ఆధ్వర్యంలోని టీమిండియా టైటిల్ గెలుచుకుంది. అదే సమయంలో ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ టోర్నమెంట్ సందర్భంగా అద్భుతంగా రాణించాడు. వికెట్లతో పాటు జట్టుకు కావలసినప్పుడు బ్యాటింగ్ కు దిగి పరుగులు రాబట్టగలిగాడు.
దీంతో టీమిండియా అవలీలగా ట్రోఫీని గెలుచుకుంది. అయితే ఈ విజయంలో మహేంద్ర సింగ్ ధోని పాత్ర మాత్రమే ఉందని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాజాగా ఇర్ఫాన్ పఠాన్ ఫైర్ అయ్యారు. ధోని వల్ల మాత్రమే టైటిల్ రాలేదని.. తన లాంటి సభ్యులందరూ కలిసి టీం ఇండియాను గెలిపించారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒక్కడికే క్రెడిట్ ఇవ్వకూడదని వెల్లడించారు.
2007 ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగగా షాహిద్ అఫ్రిదిని ఔట్ చేసేందుకు మహేంద్రసింగ్ ధోని తనను వాడుకున్నాడని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఇర్ఫాన్ పఠాన్. అఫ్రిదిని గతంలో చాలా సార్లు తాను అవుట్ చేసిన విషయాన్ని గుర్తు చేసి.. తనకు ధోని బంతి ఇచ్చాడని వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే బౌన్సర్ వేస్తానని ధోనికి చెప్పానన్నారు. దానికి తగ్గట్టుగా బౌన్సర్ వేసి ఔట్ చేసినట్లు గుర్తు చేశారు. అలా ధోని కంటే, ఎక్కువగా టీమిండియాకు పని చేశానని తెలిపారు. ఇక గతంలో కూడా మహేంద్రసింగ్ ధోనీ పై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుక్కా ఏర్పాటు చేసిన వాళ్లకే టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోని చాన్సులు ఇచ్చేవాడని బాంబు పేల్చారు.