Shahid Afridi slams Mohsin Naqvi: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ (Pakistan tour of England 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ ( Pakistan tour of England 2026) నేపథ్యంలో అత్యంత దారుణమైన ప్రదర్శనను పాకిస్తాన్ జట్టు కనబరుస్తోంది. ఈ మ్యాచ్ కూడా దొబ్బేలాగా ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగులకు పాకిస్తాన్ కుప్పకూలింది. ఇవాళ లేదా రేపు మ్యాచ్ కూడా ఫినిష్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ వరుస ఓటముల గురించి షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఓటములకు మోక్షం నక్వి ఒక్కడే కారణమంటూ బాంబు పేల్చారు. చేతకాని దద్దమ్మకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందని విమర్శలు చేశారు. దీంతో మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi ) పై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా ఓటమి పాలు అవుతున్న నేపథ్యంలో రియాక్ట్ అయ్యారు షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్ వరుస ఓటములకు ముఖ్య కారణం ప్లేయర్లు కాదని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi ) అంటూ బాంబు పేల్చాడు. ఒక ఓవర్ లో ఎన్ని బంతులు ఉంటాయో వాడికి సరిగ్గా తెలియదని… అలాంటి వాడికి రెండు పదవులు అప్పగించారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉంటూనే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించడం సవాలుతో కూడుకున్న విషయం అన్నారు. రెండు కీలకమైన పదవులు అయిన నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi )… ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదని విమర్శించారు. వాడి తెలివి తక్కువ తనం వల్లే పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి దారుణంగా తయారైందని ఆగ్రహించారు.
మొహ్సిన్ నఖ్వీకి క్రికెట్ గురించి పెద్దగా తెలియదని తాను చాలా సార్లు పేర్కొన్నట్లు గుర్తు చేశారు షాహిద్ అఫ్రిది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు వివరించారు. సలహాదారులను పెట్టుకొని మరీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును డీల్ చేస్తున్నాడని మొహ్సిన్ నఖ్వీపై సీరియస్ అయ్యారు. అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా క్రికెట్ పై అవగాహన లేనివాళ్లేనని విమర్శించారు. అందుకే నాణ్యమైన ప్లేయర్లను పాకిస్తాన్ జట్టులోకి తేవడంలో మొహ్సిన్ నఖ్వీ విఫలమవుతున్నాడని చురకలు అంటించారు. ఇప్పటికైనా అతడిని తప్పించి తనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని పరోక్షంగా డిమాండ్ చేశారు షాహిద్ అఫ్రిది.