england cricketers: యాషెస్ సిరీస్ 2025 ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఆశలతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టుకి తీవ్ర నిరాశ ఎదురయింది. ఇంతకుముందు ఎన్నడూ లేనంత బలంగా తమ జట్టు ఉందని భావించి.. సిరీస్ కి ముందే కప్ మాదే భావించిన ఇంగ్లాండ్ జట్టు అంచనాలు తారుమారయ్యాయి. ఈ సిరీస్ ని ఇప్పటికే ఆస్ట్రేలియా 3-0 తో సొంతం చేసుకుంది. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా సిరీస్ ని చేజిక్కించుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తాయి.
Also Read: Dhoni – salman: ట్రాక్టర్ తో పొలం దున్నిన ధోని & సల్మాన్.. ఒళ్ళంతా బురదతో
ఇప్పటికే సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ జట్టుపై తాజాగా సంచలన ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఫుల్లుగా మద్యం సేవించారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రెండవ టెస్ట్, మూడవ టెస్ట్ ల మధ్య నూసాలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు విచ్చలవిడిగా మద్యం తాగారన్న వార్త సంచలనం రేపింది. బెన్ డకెట్ ఏకంగా మద్యం మత్తులో హోటల్ దారి మర్చిపోయాడనే వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు {ECB} తీవ్రంగా స్పందించింది.
ఆటగాళ్లపై ఏకంగా విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై తాజాగా ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ రాబ్ కీ స్పందిస్తూ.. ” ఈ ఘటనపై దర్యాప్తు చేస్తాం. ఇలా ఫుల్లుగా మద్యం తాగడం ఆమోదయోగ్యం కాదు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా చేయడం ఎప్పటికీ నేను ఒప్పుకోను. ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయకపోవడం తప్పిదం అవుతుంది. కానీ నాకు తెలిసినంతవరకు మా ఆటగాళ్లు మంచిగానే ప్రవర్తించారు. ఒకవేళ మా క్రికెటర్లు ఎక్కువగా తాగి ఉంటే అది ఖచ్చితంగా తప్పిదమే. మద్యం సేవించడం ఎవరికైనా హానికరం. ప్లేయర్లు డిన్నర్ సమయంలో ఒక గ్లాస్ వైన్ తాగితే పరవాలేదు. కానీ ఆ పరిమితి మించితే కచ్చితంగా క్షమించదగినది కాదు”. అని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఫుల్లుగా మద్యం సేవించి దారి తప్పిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో తిరిగి ఎలా వెళ్లాలో తెలుసా అంటూ ఓ మహిళ ప్రశ్నించగా.. డకెట్ “తెలీదు” అని జవాబు ఇచ్చాడు. దీంతో పాటు మరో ఆటగాడు జాకబ్ బేతెల్ క్లబ్ లో మధ్యం మత్తులో డాన్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. రెండవ టెస్టులో ఓటమి అనంతరం మళ్లీ కొత్తగా ఉత్తేజం పొంది సిద్ధం అయ్యేందుకు వీలుగా అంటూ హెడ్ కోచ్ మెక్ కల్లమ్ నాలుగు రోజులపాటు ఈ రిసార్ట్ ప్రణాళికను రూపొందించాడు.
Also Read: U19 Asia Cup 2025: వైభవ్ ను ర్యాగింగ్ చేసిన పాక్ ఫ్యాన్స్.. షాకింగ్ వీడియో వైరల్
అయితే ఆ మధ్యలో వచ్చిన సెలవు రోజు తరువాత జట్టుపై ఎటువంటి విమర్శలు రాలేదు. కానీ మూడవ టెస్టులో కూడా ఓడిపోయి.. ఏకంగా సిరీస్ కోల్పోయిన తర్వాత ఆటగాళ్ల షికారుపై చర్చ మొదలైంది. మొదట రిసార్ట్ లో మా ఆటగాళ్లు బాగానే ప్రవర్తించారు అని ప్రకటించిన రాబ్ కీ.. సిరీస్ కోల్పోయి ప్రస్తుతం తీవ్ర విమర్శలు రావడంతో పరిమితికి మించి మద్యం తీసుకోవడం మంచిది కాదని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపాడు.
🚨🚨 ECB has launched an investigation into English players beer-drinking for 6 days out of 9 during trip to Noosa just before 3rd test.@MichaelVaughan @KP24 thoughts?#Ashes2025 #ashes25 pic.twitter.com/iTVVQ3VtV6
— The last dance (@26lastdance) December 24, 2025