CT 2029-WC 2031: భారత దేశం అలాగే పాకిస్తాన్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దీని ఎఫెక్ట్ క్రికెట్ పైన కూడా ఇప్పటికే పడింది. అయితే ఈ వివాదం భారత క్రికెట్ నియంత్రణ మండలిని ( Board of Control for Cricket in India ) రోడ్డున పడేసేలా కనిపిస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( india vs pakistan) మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో 2029లో జరిగే ఛాంపియన్ ట్రోఫీ ( Champions Trophy 2029) అలాగే 2031 లో జరిగే వన్డే వరల్డ్ కప్ ను ( World Cup 2031 ) ఇండియాలో కాకుండా ఆస్ట్రేలియాలో ( Australia ) నిర్వహించేందుకు క్రికెట్ బాస్ ఐసీసీ ( ICC) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రెండు టోర్నమెంట్లు ఇండియాలో నిర్వహించకపోతే బీసీసీఐకి కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య వివాదాలు రాసుకుంటున్నాయి. సరిహద్దులో నిత్యం రెండు దేశాలు తలపడుతూనే ఉంటాయి. మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేసింది మోడీ ప్రభుత్వం. దీంతో ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మరింత దూరం పెరిగింది. అయితే ఈ దూరం క్రికెట్ పైన కూడా పడుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్లో ఇండియా పర్యటించడం లేదు.. ఇటు ఇండియాలో పాకిస్తాన్ పర్యటించడం లేదన్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లు జరిగితే తటస్థ వేదికలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిలు ఉంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2029 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే 2031 లో జరిగే వన్డే వరల్డ్ కప్ రెండు కూడా ఆస్ట్రేలియాకు తరలించేందుకు ఐసీసీ కుట్రలకు తెరలైపోయినట్లు ద ఏజ్ వెల్లడించింది.
గతంలో ఆస్ట్రేలియాలో ఐసీసీ ఈవెంట్స్ నిర్వహిస్తే చాలా సక్సెస్ అయ్యాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఐసీసీ.. తరలించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ది ఏజ్ పేర్కొంది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లు ఇండియాలో నిర్వహిస్తే మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గొడవలు… బంగ్లాదేశ్ ఎపిసోడ్ తెరపైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పెంట కంటే ఈ రెండు టోర్నమెంట్లను ఆస్ట్రేలియాలో నిర్వహిస్తే ఎలాంటి గొడవ ఉండదని అనుకుంటున్నారట. ఆస్ట్రేలియా వీలు కాకపోతే దక్షిణాఫ్రికాను ఎంచుకోనున్నారట. నిజంగానే ఈ రెండు టోర్నమెంట్లు ఇండియా నుంచి తరలిపోతే బీసీసీఐకి తీవ్రస్థాయిలో నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి. బీసీసీఐ తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. అయితే ఈ రెండు ఐసీసీ ఈవెంట్లు ఇండియాలో జరగకుండా తరలిపోతే బీసీసీఐ అస్సలు ఊరుకోదు. కావాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను ఈ ఈవెంట్స్ లో లేకుండా చేసి… ఇండియాలో ఐసీసీ ఈవెంట్స్ జరిగేలా బీసీసీఐ అడుగులు వేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇండియా నుంచి ఎలాంటి ఐసీసీ ఈవెంట్స్ పోవని చెబుతున్నారు క్రీడా విశ్లేషకుడు.
🚨 NO FUTURE ICC EVENTS IN INDIA 🚨
– ICC is considering shifting CT 2029 & ODI WC 2031 to Australia due to political tensions between India & Pakistan 🧐
– BTW, this is just a rumours and a back-up plan reported by 'The Ages' 🤨
– What's your take 🤔pic.twitter.com/peUvJc8ryg
— Richard Kettleborough (@RichKettle07) February 18, 2026