E-Paper
Advertisement

CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

CT 2029-WC 2031: భార‌త దేశం అలాగే పాకిస్తాన్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దీని ఎఫెక్ట్ క్రికెట్ పైన కూడా ఇప్పటికే పడింది. అయితే ఈ వివాదం భారత క్రికెట్ నియంత్రణ మండలిని ( Board of Control for Cricket in India ) రోడ్డున పడేసేలా కనిపిస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( india vs pakistan) మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో 2029లో జరిగే ఛాంపియన్ ట్రోఫీ ( Champions Trophy 2029) అలాగే 2031 లో జరిగే వన్డే వరల్డ్ కప్ ను ( World Cup 2031 ) ఇండియాలో కాకుండా ఆస్ట్రేలియాలో ( Australia ) నిర్వహించేందుకు క్రికెట్ బాస్ ఐసీసీ ( ICC) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రెండు టోర్నమెంట్లు ఇండియాలో నిర్వహించకపోతే బీసీసీఐకి కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Also Read: ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు

పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య వివాదాలు రాసుకుంటున్నాయి. సరిహద్దులో నిత్యం రెండు దేశాలు తలపడుతూనే ఉంటాయి. మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేసింది మోడీ ప్రభుత్వం. దీంతో ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మరింత దూరం పెరిగింది. అయితే ఈ దూరం క్రికెట్ పైన కూడా పడుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్లో ఇండియా పర్యటించడం లేదు.. ఇటు ఇండియాలో పాకిస్తాన్ పర్యటించడం లేదన్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లు జరిగితే తటస్థ వేదికలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిలు ఉంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2029 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే 2031 లో జరిగే వన్డే వరల్డ్ కప్ రెండు కూడా ఆస్ట్రేలియాకు తరలించేందుకు ఐసీసీ కుట్రలకు తెరలైపోయినట్లు ద ఏజ్ వెల్లడించింది.

గతంలో ఆస్ట్రేలియాలో ఐసీసీ ఈవెంట్స్ నిర్వహిస్తే చాలా సక్సెస్ అయ్యాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఐసీసీ.. తరలించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ది ఏజ్ పేర్కొంది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లు ఇండియాలో నిర్వహిస్తే మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గొడవలు… బంగ్లాదేశ్ ఎపిసోడ్ తెరపైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పెంట కంటే ఈ రెండు టోర్నమెంట్లను ఆస్ట్రేలియాలో నిర్వహిస్తే ఎలాంటి గొడవ ఉండదని అనుకుంటున్నారట. ఆస్ట్రేలియా వీలు కాకపోతే దక్షిణాఫ్రికాను ఎంచుకోనున్నారట. నిజంగానే ఈ రెండు టోర్నమెంట్లు ఇండియా నుంచి తరలిపోతే బీసీసీఐకి తీవ్రస్థాయిలో నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది.

నిజంగానే ఐసీసీ ఈవెంట్స్ తరలిపోతాయా ?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి. బీసీసీఐ తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. అయితే ఈ రెండు ఐసీసీ ఈవెంట్లు ఇండియాలో జరగకుండా తరలిపోతే బీసీసీఐ అస్సలు ఊరుకోదు. కావాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను ఈ ఈవెంట్స్ లో లేకుండా చేసి… ఇండియాలో ఐసీసీ ఈవెంట్స్ జరిగేలా బీసీసీఐ అడుగులు వేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇండియా నుంచి ఎలాంటి ఐసీసీ ఈవెంట్స్ పోవని చెబుతున్నారు క్రీడా విశ్లేషకుడు.

Also Read: Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్ప‌యిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

 

Related News

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

Big Stories

×