India’s ODI Squad: దక్షిణాఫ్రికాతో వన్డే, టి-20 సిరీస్ లు గెలుచుకున్న భారత జట్టు.. 2026 టి-20 వరల్డ్ కప్ టోర్నికి ముందు న్యూజిలాండ్ తో వన్డే, టి-20 సిరీస్ లు ఆడబోతోంది. జనవరి 11 నుండి మొదలయ్యే ఈ సిరీస్.. జనవరి 31 వరకు కొనసాగుతుంది. ఇందులో భారత్ – న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు, ఐదు టి-20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ 8 మ్యాచ్ లు, 8 వేరువేరు వేదికలలో సాగుతాయి.
Also Read: Rohit sharma: రోహిత్ శర్మను ఆటపట్టించిన ఫ్యాన్.. వడాపావ్ అంటూ!
అయితే భారత్ లో జరిగే ఈ వన్డే, టి-20 సిరీస్ కోసం న్యూజిలాండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఇందులో వన్డే సిరీస్ కి మైకేల్ బ్రాస్ వెల్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఇక టి-20 సిరీస్ కి మిచెల్ సాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అయితే ఇప్పటికే న్యూజిలాండ్ తో తలపడే టీమ్ ఇండియా టీ-20 ప్రకటించిన బిసిసిఐ.. వన్డే జట్టును మాత్రం { India’s ODI Squad} ఇంతవరకు ప్రకటించలేదు.
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరగనున్న వన్డే సిరీస్ కి సంబంధించిన టీం ఇండియా జట్టు ప్రకటన ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ {Shreyas Iyer} అని సమాచారం. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ పై ఇంకా స్పష్టత రాకపోవడంతోనే జట్టు ఎంపికను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ {NCA} లో రిహ్యబిలిటేషన్ కొనసాగిస్తున్నాడు. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీ ట్రైనర్స్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ కఠినంగా శ్రమిస్తున్నాడు. అయితే అతడు గాయం నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నాడని సమాచారం. తుది నిర్ణయం కోసం బీసీసీఐ.. ఎన్సీఏ మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో టీమిండియా జుట్టు ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: england cricketers: పీకల దాకా తాగి దొరికిపోయిన క్రికెటర్లు.. ఇంగ్లాండ్ బోర్డు సంచలన నిర్ణయం
తాజాగా కొంతమంది జర్నలిస్టులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి ఇంత త్వరగా కోలుకోవడం అసాధ్యం అని.. అతడు రాబోయే ఐపీఎల్ ఆడటం కూడా అనుమానమేనని వారు పేర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ పై స్పష్టత వచ్చిన తర్వాతే వన్డే జట్టుపై తుది ప్రకటన ఉంటుందని సమాచారం. అలాగే భవిష్యత్తు టోర్నమెంట్ లపై కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి టీమిండియా జట్టు ప్రకటనకు అయ్యర్ కీలకంగా మారాడు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకొని మైదానంలోకి రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
🚨🚨 India's ODI Squad announcement vs New Zealand is delayed due to Shreyas Iyer!
– BCCI is waiting for NCA's report on Shreyas Iyer's fitness status.
– Shreyas has shown a great recovery, he is working very hard in NCA with trainers.
2 RS Journos said, his IPL is doubtful🤣 pic.twitter.com/UOhoXFQF85
— Rajiv (@Rajiv1841) December 25, 2025