E-Paper
Advertisement

BAN Vs IND: రెండు దేశాల మ‌ధ్య శ‌త్రుత్వం.. భారత్, బంగ్లాదేశ్ సిరీస్ ర‌ద్దు..!

BAN Vs IND: రెండు దేశాల మ‌ధ్య శ‌త్రుత్వం.. భారత్, బంగ్లాదేశ్ సిరీస్ ర‌ద్దు..!

BAN Vs IND: ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవు. ప‌చ్చి గ‌డ్డి వేస్తే భగ్గుమ‌నే ప‌రిస్థితులు ఉన్నాయి. రెండు దేశాల మధ్య రాజ‌కీయ ప‌ర‌మైన ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు మ‌ర‌ణశిక్ష ప‌డింది. దీని ఎఫెక్ట్ క్రికెట్ మ్యాచ్ ల‌పై ప‌డింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పురుషుల క్రికెట్ మ్యాచ్ సిరీస్ వాయిదా పడగా, ఇప్పుడు మరో సిరీస్ కు కూడా బ్రేక్ పడింది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్ మాసంలో 3 వన్డేలు, మూడు టి20 ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే రెండు దేశాల మధ్య దౌత్యపరమైన కారణాలవల్ల ఈ సిరీస్ వాయిదా పడినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి అధికారిక ప్రకటన కూడా ఇవాళ లేదా రేపు చేసే ఛాన్స్ ఉందట. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ క్యాన్సిల్ ?

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య డిసెంబర్ మాసంలో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య రాజకీయపరమైన, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ సిరీస్ ను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ తో సిరీస్ కు తమకు పర్మిషన్ రాలేదని బిసీసీఐ వర్గాలు కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సిరీస్ వాయిదా పడితే డిసెంబర్ మాసంలో ప్రత్యామ్నాయంగా వేరే సిరీస్ కు ఏర్పాట్లు చేస్తామని బిసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సిరీస్ జరిగి ఉంటే 3 వన్డేల తో పాటు మూడు టి20లు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు వాయిదా పడుతున్న నేపథ్యంలో, శ్రీలంక లాంటి జ‌ట్లతో మరో సిరీస్ ప్లాన్ చేసే పనిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉందట.

అల్లర్లు చెలరేగే ప్రమాదం

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు ( Sheikh Hasina) మ‌ర‌ణశిక్ష ప‌డింది. దీంతో ఆ దేశంలో అల్ల‌ర్లు చెల‌రేగే ఛాన్సులు ఉన్నాయి. గ‌తంలోనే అల్ల‌ర్లు జ‌రిగితే, బంగ్లాదేశ్ లోని హిందువుల‌కు చాలా న‌ష్టం జ‌రిగింది. కొంత‌మంది మ‌ర‌ణించారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ ను వదిలి ఇండియాకు పారిపోయి వచ్చింది ప్రధాని షేక్ హసీనా. ఇక ఇప్పుడు ఆమెకు మరో శిక్ష పడుతున్న నేపథ్యంలో మళ్లీ బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగే ప్రమాదం పొంచి ఉందని నిఘవర్గాలు చెబుతున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితులలో బంగ్లాదేశ్ లో టీమ్ ఇండియా మరణిస్తే, పరిస్థితి వేరే లాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు బీసీసీఐ పెద్దలు. అల్లరిలో నడుమ టీమ్ ఇండియాను పంపిస్తే పెను ప్రమాదం జరిగే ఛాన్స్ లు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సిరీస్ వాయిదా వేసుకోవడం మంచిదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆలోచన చేస్తోంద‌ట‌.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×