E-Paper
Advertisement

India vs Sri Lanka: ఉత్కంఠగా సాగిన తొలి వన్డే.. భారత్‌- శ్రీలంక మ్యాచ్‌ టై

India vs Sri Lanka: ఉత్కంఠగా సాగిన తొలి వన్డే.. భారత్‌- శ్రీలంక మ్యాచ్‌ టై

India vs Sri Lanka 1st ODI Tie: కొలొంబో వేదికగా శ్రీలంక, భారత్ జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అయింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఇందులో నిశాంక(56), దునీత్(67) హాఫ్ సెంచరీలు చేశారు. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా..సిరాజ్, దుబే, కుల్దీప్, సుందర్ లు తలో వికెట్ పడగొట్టారు.

శ్రీలంక విధించిన 231 లక్ష్యఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(58) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(33), కేఎల్ రాహుల్(31), శివమ్ దూబె(25), కోహ్లి (24), అయ్యర్(23) పరుగులు చేశారు. దీంతో 230 పరుగులు చేసి స్కోరు సమం చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్ కావడం విశేషం. శ్రీలంక బౌలర్లలో చరిత్ అసలంక, హసరంగ 3 వికెట్లు తీయగా..వెల్లలాగే 2 వికెట్లు, ధనుంజయ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.

Also Read: హాకీలో భారత్ విజయం.. 52 ఏళ్లలో ఆస్ట్రేలియాపై గెలవడం ఇదే తొలిసారి

ఇదిలా ఉండగా, టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న భారత సీనియర్లు రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, కుల్ దీప్ సింగ్ బరిలో నిల్చున్నారు. అలాగే శ్రేయస్, కేఎల్ రాహుల్ వన్డే సిరీస్ లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు శ్రీలంక జట్టులో పతిరన గాయం కారణంగా వైదొలగగా..అతని స్థానంలో షిరాజ్ కుఅవకాశం దక్కింది.

Related News

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Big Stories

×