E-Paper
Advertisement

IPL 2023: బోణీ కొట్టిన పంజాబ్, లక్నో.. 5 వికెట్లతో అదరగొట్టిన వుడ్

IPL 2023: బోణీ కొట్టిన పంజాబ్, లక్నో.. 5 వికెట్లతో అదరగొట్టిన వుడ్

IPL 2023: ఐపీఎల్ 16 సీజన్‌లో భాగంగా శనివారం మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కోల్‌కతాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భానుక రాజపక్స 32 బంతుల్లో 50 పరుగులు చేయగా.. శిఖర్ ధవన్ 40 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్ టిమ్ సాథీ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. అదే సమయంలో భారీగా వర్షం పడడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆర్ష్‌దీప్ సింగ్‌ దక్కించుకున్నాడు.

ఇక శనివారం జరిగిన రెండో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 48 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్ వుడ్ ఒక్కడే 5 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వుడ్‌కు దక్కింది.

Related News

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Big Stories

×