Kevin Pietersen Serious On PAK VS ENG: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్… పాకిస్తాన్ జట్టును రెండు టెస్టుల్లో ఓడించింది. లండన్ లోని లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కూడా చిత్తుగా ఓడింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏకంగా 194 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది ఇంగ్లాండ్. దీంతో ఒక టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పరువు తీస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లాంటి జోకర్లతో టెస్టులు ఆడి, ఇంగ్లాండ్ టైం వృధా చేసుకుంటోందని ఫైర్ అయ్యారు.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ జరిగింది. ఇందులో కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ( Kevin Pietersen) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడి టైం అంతా వృథా చేసుకుంటుందని ఇంగ్లాండ్ జట్టును విమర్శించారు. పాకిస్తాన్ తో ఆడడం కంటే బంగ్లాదేశ్ లాంటి బలమైన టీమ్స్ తో ఆడితే బెటర్ అని పరువు తీశారు. పాకిస్తాన్ లాంటి థర్డ్ క్లాస్ జట్లతో ఆడి, ఇంగ్లాండ్ జట్టే పరువు తీసుకుంటుందని చురకలు అంటించారు. పాకిస్తాన్ జట్టులో ఒక్కడు కూడా సరిగ్గా ఆడడం లేదని… జట్టును గెలిపిద్దాం అన్న కసి ఎవరిలో లేదని సెటైర్లు పేల్చారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ కంప్లీట్ గా ఆదిపత్యం చెరయిస్తోంది. మొదటి టెస్ట్ లో విజయం సాధించిన ఇంగ్లాండు.. రెండు టెస్టులో కూడా అదరగొట్టింది. ఈ రెండు టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగగా.. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 29 పరుగులు చేసింది. 208 పరుగులు చేసి తేలిపోయినా… బౌలింగ్ లో అదరగొట్టింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 110 పరుగులకు కుప్పకూలగా రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులు చేసి ఓడిపోయింది.