Shreyas Iyer- Punjab kings :cఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament ) నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎల్ 2027 టోర్నమెంట్ కు దాదాపు 7, 8 నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. కీలక ప్లేయర్లను తమ జట్టులోకి తీసుకునేందుకు సంసిద్ధమవుతున్నాయి. అవసరం లేదనుకున్న వాళ్లను వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాకు శ్రేయస్ అయ్యర్ వెన్నుపోటు పొడిచినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. హార్దిక్ పాండ్యా తరహాలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కూడా యూటర్న్ తీసుకోబోతున్నాడట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ ఇచ్చి కోట్లు ఖర్చుపెట్టిన ప్రీతి జింటాకు (preeti zinta) శ్రేయస్ అయ్యర్ వెన్నుపోటు పొడిచినట్లు వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో మళ్లీ ఆ జట్టులోకి వెళ్లేందుకు శ్రేయస్ అయ్యార్ సిద్ధమయ్యాడట. అజింక్య రహానేను పక్కకు పెట్టిన నేపథ్యంలో.. కేకేఆర్ జట్టుకు కెప్టెన్ అవసరం వచ్చి పడింది. అందుకే శ్రేయస్ అయ్యర్ ను మళ్ళీ జట్టులోకి తీసుకునేందుకు షారుఖ్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే దాదాపు 50 కోట్లకు డీల్ కూడా కుదిరిందని అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇదే నిజమైతే పంజాబ్ కింగ్స్ జట్టుకు గుడ్ బై చెప్పి కేకేఆర్ జట్టులో శ్రేయస్ అయ్యార్ చేరే అవకాశాలు ఉన్నాయి.
కేకేఆర్ వద్దని వదిలేసిన సమయంలో శ్రేయస్ అయ్యర్ కు ఎంతో అండగా నిలిచారు ప్రీతిజింటా. అలాంటి ప్రీతి జింటాకు మళ్లీ పంగనామాలు పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ అని శ్రేయస్ అయ్యర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. కేకేఆర్ జట్టులోకి శ్రేయస్ అయ్యర్ వెళితే, మాత్రం అతనికి హార్దిక్ పాండ్యా పరిస్థితులే ఎదురవుతాయని స్పష్టం చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కెరీర్ కోల్పోవడం గ్యారంటీ అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా 2025 మెగా వేలం సందర్భంగా 26.75 కోట్లు పెట్టి శ్రేయస్ అయ్యర్ అని కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. అంతకుముందు 2022లో 12.25 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ శ్రేయస్ అయ్యర్ టాలెంట్ గుర్తించి ప్రీతిజింటా డబుల్ రేట్ పెట్టి మరీ, అతడిని కొనుగోలు చేస్తే ఇప్పుడు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.