Kamran Akmal On Imran Khan: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (IMRAN KHAN) జైలు జీవితం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( England vs Pakistan) టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) జరుగుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ వివాదం మరింత రాజు కుంటోంది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ వివాదాన్ని ఇంగ్లాండ్ మాజీలు తెరపైకి తీసుకువస్తున్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని దోషిలా నిలబెడుతున్నారు. అయితే, పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండు టెస్ట్ జరుగుతున్న క్రమంలో ఇమ్రాన్ ఖాన్ కుమారుల వీడియోను ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ ఆథర్టన్ ప్రచురించాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధాంతరంగా రెండో టెస్టును బాయ్ కాట్ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంది.
ఇమ్రాన్ ఖాన్ వివాదంపై వెంటనే ఇంగ్లాండు క్రికెట్ బోర్డు స్పందించి సమస్యను సద్దుమణిగేలా చేసింది. అయితే ఈ వివాదం గురించి తాజాగా పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal) కూడా స్పందించారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్ అంటే భయం పట్టుకున్న ఇంగ్లాండు… తమను దెబ్బతీసేందుకు ఇలా కుట్రలు చేస్తుందని ఆగ్రహించారు. అందుకే ఇమ్రాన్ ఖాన్ వివాదాన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న గ్రామంలో ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూలు చేసి విడుదల చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు కమ్రాన్ అక్మల్. ఇక ఈ ఇంటర్వ్యూ విడుదలైన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెంటనే రియాక్ట్ కావడం మంచి పరిణామం అని ప్రశంసించారు. క్రికెట్ కు అలాగే రాజకీయాలకు ముడి పెడుతూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
అలాంటి వాళ్లకు బుద్ధి చెబుతూ మొహ్సిన్ నఖ్వీ కీలక నిర్ణయాలు తీసుకుని, ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూను ఆపేశాడని ప్రశంసించారు. ఈ విషయంలో మొహ్సిన్ నఖ్వీకి దండేసి దండం పెట్టాల్సిందేనని వెల్లడించారు. లేకపోతే పాకిస్తాన్ పరువు పోయేదని తెలిపారు. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను బాయ్ కాట్ చేసినా కూడా మొహ్సిన్ నఖ్వీని తాను ప్రశంసించే వాడినని తెలిపారు. దీంతో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.