E-Paper
Advertisement

Saqlain Mushtaq : మిస్ట‌ర్ బ్రూక్‌..పిచ్ ఫోటో ముందే తీసుకో..లేక‌పోతే టీమిండియా గోల్ మాల్ చేస్తుంది

Saqlain Mushtaq : మిస్ట‌ర్ బ్రూక్‌..పిచ్ ఫోటో ముందే తీసుకో..లేక‌పోతే టీమిండియా గోల్ మాల్ చేస్తుంది

Saqlain Mushtaq :  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో భాగంగా ఇవాల్టి నుంచి సెమీ ఫైనల్ షురూ కానుంది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( South Africa vs New Zealand) మధ్య మొదటి సెమీ ఫైనల్ నిర్వహించనున్నారు. రేపు టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England) మధ్య రెండో సెమీ ఫైనల్ ఉండనుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు సెమీ ఫైనల్స్ కోసం ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ ( Saqlain Mushtaq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఏదైనా చేసి గెలిచే ప్రమాదం పొంచి ఉందని బాంబు పేల్చారు. పిచ్ మార్పిడి చేసే అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడించారు.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

పిచ్ ఫోటో ముందే తీసుకో.. ఇంగ్లాండ్ కెప్టెన్ కు సూచనలు

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ముంబై వాంఖ‌డే ( Mumbai Wankhede  Stadium) వేదికగా టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ 2 జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ ( Saqlain Mushtaq )  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సెమీ ఫైనల్ లో టీమిండియా గెలిచేందుకు ఎలాంటి కుట్రలకైనా తెర లేపుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై వాంఖ‌డే స్టేడియానికి సంబంధించిన పిచ్ ( Pitch) ఫోటోను ముందే ఫోటో తీసుకోవాలని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ( Harry Brooke ) సూచనలు చేశారు సైక్లైన్‌ ముస్తాక్. లేకపోతే మ్యాచ్ ఓడిపోయే సమయంలో పిచ్ మొత్తం మార్చేస్తారని ఇండియాపై ఆరోపణలు చేశారు. అప్పుడు ఇంగ్లాండ్ ఓడిపోయి టీం ఇండియా గెలిచే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి హ్యారీ బ్రూక్ చాలా జాగ్రత్తగా ఉండి పిచ్ కు సంబంధించిన ఫోటోలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇండియన్ ఎప్పుడూ నమ్మరాదని.. వాళ్లు అంపైర్లను కొనుగోలు చేసి మ్యాచ్ గెలుస్తారని కూడా ఆరోపించారు.

అభిషేక్ శర్మ అవుట్.. సంజు పై నిషేధం

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. సరిగ్గా ఫామ్ లేని అభిషేక్ శర్మ పై వేటు వేసి రింకూ సింగ్ తెరపైకి తీసుకువస్తున్నారట. అటు వెస్టిండీస్ పై విజయం సాధించిన తర్వాత వివాదాస్పదంగా సెలబ్రేషన్స్ చేసుకున్న సంజు శాంస‌న్‌ పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఈ యాక్షన్ తీసుకోనున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×