E-Paper
Advertisement

Green – Pathirana: గ్రీన్ కు వెన్నుపోటు…పతిరణకే ఎక్కువ డబ్బులు ఇస్తోన్న కేకేఆర్‌ !

Green – Pathirana: గ్రీన్ కు వెన్నుపోటు…పతిరణకే ఎక్కువ డబ్బులు ఇస్తోన్న కేకేఆర్‌ !

Green – Pathirana:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించాలని ప్రిపరేషన్ మొదలుపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఐపీఎల్ మినీ వేలంకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన గ్రీన్, 18 కోట్లు మాత్రమే పలికిన మతీషా పతిరనా కంటే తక్కువ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే గ్రీన్ కంటే రూ.3 కోట్లు ఎక్కువ‌గా మతీషా పతిరనా తీసుకోనున్నాడ‌ట‌. దీంతో ఈ న్యూస్ వైర‌ల్ గా మారింది.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

గ్రీన్ కంటే మతీషా పతిరనాకు ఎక్కువ డబ్బులు.. ఎలా అంటే?

ఐపీఎల్ మినీ వేలం 2026లో ( IPL 2026 Tournament  ) ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ ( Cameron Green) రూ.25.20 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఇంత భారీ స్థాయిలో ధర పెట్టి కేకేఆర్ జట్టు ( KKR) కొనుగోలు చేసింది. అటు శ్రీలంక ఆటగాడు మతీషా పతిరనాను 18 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్. దీంతో అత్యధిక ధర పలికిన టాప్ 2 విదేశీ ప్లేయర్లుగా ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు రికార్డు సృష్టించారు. అయితే వేలంలో ధర పలికిన ప్రకారం ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ కు ఎలా చూసిన ఎక్కువ డబ్బులు రావాలి. కానీ గ్రీన్ కంటే మతీషా పతిరనాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. గ్రీన్ కంటే ఏకంగా మూడు కోట్లు ఎక్కువగా తీసుకుంటున్నాడు శ్రీలంక ఆటగాడు మతీషా పతిరనా. ఓవర్సీస్ ప్లేయర్ల ఫీజు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్ పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ రోజు ప్రకారం గ్రీన్ కు కేవలం 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. అందులో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా విధించే టాక్స్ లు ఉంటాయి. అవి పోగా గ్రీన్ చేతిలో పడేది 9.9 కోట్లు మాత్రమే. అదే శ్రీలంక ఆటగాడు మతీషా పతిరనాకు ఇండియాతో పాటు శ్రీలంక టాక్స్ లు చాలా తక్కువ పడుతున్నాయి. దీంతో మతీషా పతిరనా చేతిలో 12.9 కోట్ల రూపాయలు పడనున్నాయి. దీంతో మతీషా పతిరనా ఫుల్ హ్యపీగా ఉన్నాడు.

విదేశీ ప్లేయ‌ర్లకు ఐపీఎల్ యాజ‌మాన్యం షాక్‌

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament ) నేపథ్యంలో కొత్త రూల్ తీసుకువచ్చింది బీసీసీఐ. విదేశీ ప్లేయర్లకు 18 కోట్ల కంటే ఎక్కువగా ఇవ్వకూడదని డిసైడ్ అయింది. ఒకవేళ 18 కోట్లు దాటి వేలంలో ఆ విదేశీ ప్లేయర్లకు రేటు వస్తే, 18 కోట్లు మాత్రమే ఇవ్వాలని పేర్కొంది. 18 కోట్ల తర్వాత వచ్చిన డబ్బులన్నీ ఐపిఎల్ ప్లేయర్ల డెవలప్మెంట్ కోసం వినియోగించనున్నారు.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

 

 

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×