PSL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ముగిసిన నేపథ్యంలో అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది క్రికెటర్లు. ఐపీఎల్ టోర్నమెంట్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడం, తదితర కారణాలవల్ల, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హైదరాబాద్ ప్లేయర్ లివింగ్ స్టోన్ (Livingstone ), ముంబై ఆటగాడు మిచెల్ సాంట్నర్ ( Mitchell Santner) ఇద్దరు కూడా ఐపీఎల్ 2026 పూర్తి కాగానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఐపీఎల్ పై బురద జల్లి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.
Also Read: Tanveer Ahmed: బాబర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభవ్ కంటే భయంకరంగా ఆడతాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పైన హైదరాబాద్ ఆటగాడు లివింగ్ స్టోన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ క్రికెటర్లతో జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లివింగ్ స్టోన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ పరమ బోరింగ్ అంటూ బాంబు పేల్చారు. ఈ టోర్నమెంట్ లో బ్యాటర్లకు మాత్రమే మైదానాలు అనుకూలిస్తున్నాయని.. 240 పరుగుల టార్గెట్ కూడా 18 వ ఓవర్స్ లో ఫినిష్ చేస్తున్నారని విషం కట్టాడు. అలాగే తుది జట్టు ఎంపిక నేపథ్యంలో కావ్య పాప జోక్యం చేసుకుంటారని కూడా ఆమెపై ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో ఐపీఎల్ టోర్నమెంట్ పట్టించుకునే నాధుడే ఉండకూడని కూడా బాంబు పేల్చాడు.
ఇక అటు ముంబై ఆటగాడు మిచెల్ సాంట్నర్ కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. రెండు కోట్లు పెట్టి ఈసారి మిషన్ రిటైన్ చేసుకుని ముంబై ఇండియన్స్. అయితే ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ జరగగా… ఆ సందర్భంగా మిచెల్ సాంట్నర్ భుజానికి గాయమైంది. దీంతో టోర్నమెంట్ మధ్యలోనే ఇండియాను వదిలి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తనకు కోటి రూపాయలు ఇచ్చి ముంబై ఇండియన్స్ యాజమాన్యం చేతులు దులుపుకుందని ఆరోపణలు చేశారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం పూర్తిస్థాయిలో జీతం ఇవ్వలేదని ఫైర్ అయ్యాడు. ఈ ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ టోర్నమెంట్ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు మిచెల్ సాంట్నర్.
ఐపీఎల్ 2026 పూర్తి కాగానే విమర్శలు చేస్తున్న లివింగ్ స్టోన్ అలాగే మిచెల్ సాంట్నర్ ఇద్దరు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి వెళ్ళబోతున్నారట. 2027 సంవత్సరంలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ లోకి ఇద్దరు వెళ్తారట. ఈ మేరకు ఓ జట్టుతో డీలింగ్ కూడా కుదుర్చుకున్నారట. అందుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాల మేరకు… ఐపీఎల్ టోర్నమెంట్ పైన ఈ ఇద్దరు బురద చల్లుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.