టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు సందర్భంగా అత్యంత దారుణంగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ ప్రదర్శన పై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించారు. అభిషేక్ శర్మకు కొన్ని మ్యాచ్ ల వరకు బ్రేక్ ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. వరుసగా అతడు విఫలమవుతున్నాడు.. కాబట్టి అతనికి రెస్ట్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు మహమ్మద్ కైఫ్. ఇదేం బైలాటరల్ సిరీస్ కాదని ఫైర్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ లో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వరల్డ్ కప్ లో ప్రతి ఒక్క మ్యాచ్ చాలా కీలకంగా మారుతుంది.
అలాంటప్పుడు అభిషేక్ శర్మాను ఆడించకపోవడం బెటర్ అంటూ సూచనలు చేశారు మహమ్మద్ కైఫ్. అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్ లో లేడని చురకలు అంటించారు. తనకు వచ్చిన అవకాశం ఒక్కటి కూడా వినియోగించుకోలేదని… నాలుగు మ్యాచ్లలో అతను చేసింది 15 పరుగులు మాత్రమేనని ఫైర్ అయ్యారు. ఇన్ని అవకాశాలు వచ్చినా కూడా విఫలమవుతున్న అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వాలన్నారు. అతనికి బ్రేక్ ఇచ్చి అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని కోరారు. అలా చేయకపోతే టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అంటూ ఫైర్ అయ్యారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఇప్పటి వరకు అభిషేక్ శర్మ నాలుగు మ్యాచ్లలో ఆడాడు. ఇందులో మూడు మ్యాచ్లో డక్ అవుట్ కాగా.. సూపర్ 8 లో భాగంగా దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లలో 15 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. అంతే తప్ప అభిషేక్ శర్మ సాధించింది ఏమీ లేదు.
Grok:
How to silence 100,000+ people?Grok:
Here's the video; Corbin Bosch taking Abhishek Sharma's catch with pin-drop silence even with 100,000+ peopleFact – Bowl slower or right arm off spinners against Abhishek, he will dance like nothing 🤐pic.twitter.com/RyrOlTAFa7
— Richard Kettleborough (@RichKettle07) February 23, 2026