Mohammad Kaif : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మకు ఈనెల 19వ తేదీన జరిగే వన్డేనే చివరిది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ ఆడడం లేదని.. ఇప్పటికే అతనికి బిసిసిఐ స్పష్టం చేసిందట. లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే ఆడేసి… రిటైర్మెంట్ కూడా ఇస్తాడని అంటున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల పై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
41 సంవత్సరాల క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo) ఇప్పటికి ఫుడ్ బాల్ ఆడుతున్నాడని… అలాంటిది రోహిత్ శర్మ ఆడితే తప్పేంటి అని నిలదీశారు. రోహిత్ శర్మకు 39 సంవత్సరాల వయసు మాత్రమే ఉందని… అతడు కుర్ర క్రికెటర్ లాగా దూకుడుగా ఆడుతున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆడితే ఎవరికి ఏం నొప్పి? అంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ), అజిత్ అగార్కర్ లను (Ajit Agarkar) తీసేయండి అంటూ బీసీసీఐకి సూచనలు చేశారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ చేయబోతున్నట్లు వస్తున్నా వార్తలపై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) ఫైర్ అయ్యారు. కావాలనే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ పై ఒత్తిడి తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. రిటర్మెంట్ ఇచ్చేలా కుట్రలకు తెరలేపుతున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లను గంభీర్ గ్యాంగ్ తోక్కేస్తుందని మండిపడ్డారు. వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మకు ఇలా అన్యాయం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు.
2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీనియర్ క్రికెటర్ కాబట్టి వన్డేల్లో రోహిత్ శర్మ అవసరం ఎంతైనా ఉంటుందని… అతడే లేకపోతే 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టమన్నారు. క్రిస్టియానో రోనాల్డోకు 41 సంవత్సరాలు ఉన్నాయని… అతడు దేశం తరఫున అద్భుతంగా ఆడుతున్నట్లు గుర్తు చేశారు. మరి 39వేల రోహిత్ శర్మ ఆడితే గంభీర్ (Gautam Gambhir), అజిత్ అగార్కర్ లకు (Ajit Agarkar) ఏం నొప్పి అంటూ ఫైర్ అయ్యారు మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ). రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ కూడా వెనక్కి తగ్గాలని కోరారు.
🚨Big news about team India🚨
Gautam Gambhir and Ajit Agarkar both are making immense pressure on Rohit Sharma and Virat Kohli, they are forcing both of them to retire after England series. Team India dressing room atmosphere is at their worst after Chappel left.
Not a single… pic.twitter.com/IjRWw05xD7— Achyut Mishra (@PulledFor_Six) July 16, 2026