MS Dhoni : టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. క్రికెట్ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన కెప్టెన్సీలో ప్రపంచ కప్ లు అన్నింటిని సాధించి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం క్రికెట్ కి రిైటర్మెంట్ ప్రకటించాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు ధోనీ. తాజాగా ధోనీ రాంచీకి సమీపంలో ఉన్న దేవరీ మందిర్ ను తన కుటుంబంతో కలిసి సందర్శించాడు. తన ప్రగాఢ విశ్వాసానికి పేర్గాంచిన ధోనీ రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో డ్యూరీ అనే గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రార్థనలు చేసాడు. ఈ ఆలయంలో అమ్మవారికి 16 చేతులు కలవు. ఈ ఆలయం 700 సంవత్సరాలకు పైగా పురాతనమైదని నమ్ముతారు. ఇక్కడ గిరిజన పూజారులు, బ్రాహ్మణులు ఇద్దరూ కలిసి పూజలు నిర్వహిస్తారు.
Also Read : SRH – Venkatesh Iyer : SRH నుంచి ఇషాన్ ఔట్.. అయ్యర్ ఇన్..!
ధోనీ రాక.. భారీ బందోబస్తు..
ముఖ్యంగా ప్రధాన క్రికెట్ టోర్నమెంట్ కి ముందు ధోనీ గతంలో ఈ ఆలయాన్ని చాలా సార్లు సందర్శించాడు. ఈ సారి కొడుకు పుట్టాలని ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి రహస్యంగా పూజలు చేసినట్టు సమాచారం. శనివారంకావడంతోఅమ్మవారి ఆలయానికి విచ్చేసిన ధోనీ కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నాడు. ధోనీతో పాటు ఆయన భార్య సాక్షి, కూతురు జీవా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ధోనీ రాకతో స్థానిక పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసారు. అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ధోనీ తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతూ హ్యాపీగా ఉన్నాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ.. ఐపీఎల్ ముగిసిన వెంటనే తన ఇంటికి వెళ్లి బైకు రైడింగ్ చేస్తుంటాడు. తాను ముందు బైకు రైడింగ్ కి వెళ్లి ఆ తరువాత ఏదైనా ఆలోచిస్తానని చెప్పాడు. బైకు రైడింగ్స్, వ్యవసాయం చేయడంతో పాటు ఫ్యామిలీతో కలిసి అప్పుడప్పుడు ఇలాా ఆధ్యాత్మిక చింతనలోనూ మునిగిపోతుంటాడు. ఈ పర్యటనలో ధోనీ ఎప్పటిలాగానే చాలా వినయంతో ఉన్నాడు.
అందులో ఆసక్తికర విషయాలు..
మాజీ భారత బ్యాటర్ శిఖర్ ధావన్ 2010లో ధోనీతో తన తొలి సమావేశం గురించి ఓ ఫన్నీ కథనాన్ని గురించి తెలిపాడు. దివన్ : క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్ అనే పుస్తకంలో ధావన్ టీమిండియాకి ఎంపికైన తరువాత ధోనీని తొలిసారి కలిసినప్పుడు అతను కొంచెం భయాందోళనకు గురయ్యాడు. కానీ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నిస్తున్న ధావన్.. తాను భారత్ తరపున ఆడాలనుకుంటున్నాను. నిన్ను బాలీవుడ్ హీరోని చేయాలనుకుంటున్నానని నవ్వుతూ ధావన్ తో పేర్కొన్నాడు. 2025 ఐపీఎల్ సీజన్ కి ధోనీ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది.
?igsh=MXY5ZTY2NTR0a3N4Zg==