RCB vs GT Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో భాగంగా నిన్న రాయల్ చాలెంజెస్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Qualifier 1) తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రానించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా లేజర్ షో నిర్వహించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ లేజర్ షో ప్రదర్శనలో పెద్ద తప్పిదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు లేకుండానే ఇండియన్ మ్యాప్ ను ఈ లేజర్ షో సందర్భంగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ లేజర్ షో తప్పిదం పై ఇండియన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. బీసీసీఐ అని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.
Also Read: Vaibhav-Parag: వైభవ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బయటపెట్టిన రియాన్ పరాగ్, ఇదిగో షాకింగ్ వీడియో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ప్లే ఆఫ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రానించి బెంగళూరు విజయం సాధించింది. దీంతో ఫైనల్స్ లో అడుగు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం, ఇన్నింగ్స్ బ్రేక్ సమయాలలో లేజర్ షో నిర్వహించింది బీసీసీఐ. ఇక్కడే పెద్ద తప్పిదం చోటు చేసుకుంది. ఐపీఎల్ ట్రోఫీతో పాటు ఇండియన్ మ్యాప్ ను లేజర్ షో సందర్భంగా ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు లేకుండానే ఇండియన్ మ్యాప్ ప్రదర్శించడం ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై బీసీసీఐని ఉద్దేశించి ట్రోల్స్ చేస్తున్నారు.
నిద్రపోయి ఇలా ఇండియన్ మ్యాప్ ప్రదర్శించారా ? కొంచమైనా బుద్ధి ఉందా ? ఆ మాత్రం చూసుకోలేరా ? అంటూ ఓ రేంజ్ లో బీసీసీఐ పై మండిపడుతున్నారు. ఈ మ్యాప్ పాకిస్తాన్ వాళ్ళు చూస్తే.. ఇండియా పరువు తీయడం గ్యారంటీ అని హెచ్చరిస్తున్నారు. ఇక అటు ఇప్పటికే పాకిస్తాన్ సోషల్ మీడియా.. ఈ అంశాన్ని గట్టిగానే వైరల్ చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ ను బీసీసీఐ తమకు అప్పగించిందని కూడా కొంతమంది పాకిస్తాన్ సోషల్ మీడియా వారియర్స్ పోస్టులు పెడుతున్నారు. కాగా, టెక్నికల్ ఇష్యూ వల్ల ఉత్తరప్రదేశ్ అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు లేకుండానే ఇండియన్ మ్యాప్ ప్రదర్శించి ఉంటారని బీసీసీఐ అధికారి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ మ్యాచ్ లో బెంగళూరు.. ఏకంగా 92 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. దీంతో 5వ సారి ఫైనల్స్ లో అడుగుపెట్టింది.
Also Read: Abdul Razzaq: PSL అల్లా కంటే పవిత్రమైనది..ఐపీఎల్ అతిపెద్ద ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL