Mohammad Shahzad Comments On Pakistan Team: పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan Team) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఐసీసీ టోర్నమెంట్లలో గ్రూప్ స్టేజిలోనే ఈ మధ్యకాలంలో ఎలిమినేట్ అయి పరువు తీసుకుంటోంది. అలాంటి పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ షాజాద్ (Mohammad Shahzad) తెగ పొగిడాడు. పాకిస్తాన్ వల్లే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు బతుకుతున్నారని బాంబు పేల్చారు. పాకిస్తాన్ దేశంతో ఎన్ని గొడవలు ఉన్నా… వాస్తవం మాత్రం దాగదు అంటూ మొహమ్మద్ షాజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వల్ల తాను క్రికెట్ నేర్చుకున్నానని.. తనతో పాటు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు (Afghanistan cricketers) కూడా ఓనమాలు నేర్చుకున్నారని తెలిపారు. అసలు పాకిస్తాన్ లేకపోతే తమకు క్రికెట్ అనేది తెలియక పోయేదంటూ బాంబు పేల్చారు. అక్కడి క్రికెటర్ల వల్లే, తాము ఆట నేర్చుకున్నామన్నారు. ఇప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. దీంతో మొహమ్మద్ షాజాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ తో గొడవలు ఉన్నప్పటికీ ఆఫ్గనిస్తాన్ మాజీ ఆటగాడు మొహమ్మద్ షాజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దేశంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు అందరూ క్రికెట్ ఆడటం నేర్చుకున్నారన్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఉన్న ప్లేయర్లు కూడా పాకిస్తాన్ లోనే తమ క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించారన్నారు. తమ దేశానికి పాకిస్తాన్ అన్యాయం చేసినప్పటికీ.. క్రికెట్ లో మాత్రం న్యాయమే జరిగిందన్నారు. దీంతో మొహమ్మద్ షాజాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.
ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా సంవత్సరాలుగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య చాలాసార్లు యుద్ధం కూడా జరిగింది. ప్రత్యక్షయుద్ధం జరిగినప్పుడు.. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఇండియా నిత్యం సపోర్ట్ గానే నిలిచింది. 2021 లో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబను అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య పూర్తిగా బంధాలు తెగిపోయాయి. ఇక ఇటీవల కాబూల్ లో పాకిస్తాన్ ఓ బాంబుదాడికి తెగపడింది. ఈ క్రమంలో జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దు అయ్యాయి.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన మాజీ ఆటగాడు మొహమ్మద్ షాజాద్.. ఒకప్పుడు ఆ జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగేవాడు. ఇతన్ని ఆఫ్గనిస్తాన్ ధోని అని కూడా పిలుస్తూ ఉంటారు. కాస్త లావుగా ఉన్నప్పటికీ అద్భుతంగా ఆడతాడు మొహమ్మద్ షాజాద్. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ గా పేరుగాంచిన మొహమ్మద్ షాజాద్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. కానీ జట్టుకు మాత్రం దూరంగా ఉన్నాడు. దాదాపు అతడిని రిటైర్మెంట్ ప్లేయర్ కిందనే ట్రీట్ చేస్తున్నారు.