E-Paper
Advertisement

పాకిస్తాన్ కెప్టెన్ కు ఘోర అవ‌మానం..ట్రోఫీకి దూరంగా నిల‌బ‌డాలంటూ ఆంక్ష‌లు

పాకిస్తాన్ కెప్టెన్ కు ఘోర అవ‌మానం..ట్రోఫీకి దూరంగా నిల‌బ‌డాలంటూ ఆంక్ష‌లు

Womens T20 World Cup 2026:  ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( Womens T20 World Cup 2026) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. జూలై 12వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం అన్ని ఏర్పాట్లు ఐసిసి చేస్తోంది. ఇక నిన్న 12 జట్ల కెప్టెన్లు ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ( Pakistan captain Fatima Sana) ఘోర అవమానం ఎదురయింది. వరల్డ్ కప్ పక్కన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా నిలబడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నా ఓ లేడీ అధికారి.. ట్రోఫీ పక్కన నిలబడకు అంటూ పరువు తీసింది. పాకిస్తాన్ వాళ్లను అస్సలు నమ్మకూడదంటూ.. ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. వెంటనే ఫాతిమా సనాను అక్కడి నుంచి పక్కకు జరిపి… న్యూజిలాండ్ కెప్టెన్ ను టైటిల్ పక్కన నిలబెట్టింది. ఆ త‌ర్వాత ఫోటో తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.. పాకిస్తాన్ క్రికెట్ జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ పరువు గంగలో కలిసిందని దారుణంగా ఆడుకుంటున్నారు.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

ఐసీసీ బాస్ జై షా దేశ ద్రోహి అంటూ ట్రోలింగ్

మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 12 జట్ల కెప్టెన్లు ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కొడుకు జై షా సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు షేక్ హ్యాండ్ ఇచ్చి… వివాదానికి తెర లేపాడు. ఐసీసీ చైర్మన్ హోదాలో జై షా షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా తెలియని దద్దమ్మలు… జై షాను దేశద్రోహి అంటూ ట్రోల్ చేస్తున్నారు. దారుణంగా పోస్టులు పెడుతున్నారు. చెప్పేవి శ్రీరంగనీతులు… చేసేవి చండాలపు పనులు అంటూ దారుణంగా ఆడుకుంటున్నారు. దీనిపై వెంటనే అమిత్ షా కొడుకు జై షా ఇండియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదా తన పదవికి రాజీనామా చేయాలని అంటున్నారు.

మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్

ఐసీసీ మహిళల t20 ప్రపంచ కప్ 20026 టోర్నమెంట్ జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. రెండు గ్రూపులుగా జట్లు డివైడ్ అవుతాయి. పాకిస్తాన్ అలాగే టీమిండియా ఒకే గ్రూపులో ఉండనున్నాయి. జూన్ 14వ తేదీన ఆదివారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది.

 

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

Related News

ఐపీఎల్ 2026లో నేను ఒక్క మ్యాచ్ చూడ‌లేదు, ఆ టోర్న‌మెంట్ అంటేనే విర‌క్తి పుడుతోంది!

Tanveer Ahmed: డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించి.. టీమిండియాలోకి అడుగు పెట్టు

టీమిండియా మేనేజ్మెంట్ లో చీలిక‌…గంభీర్ ప్రెస్ మీట్ కు హాజరు కాకపోవడంపై స‌రికొత్త వివాదం !

పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాకు షేక్ హ్యాండ్…వివాదంలో ఐసీసీ బాస్‌ జై షా

Josh Inglis Watch: పాకిస్తాన్ లో జోష్ ఇంగ్లిస్ లగ్జరీ వాచ్ దొంగ‌త‌నం…!

ఇండియా, ఆఫ్ఘానిస్తాన్ టెస్ట్ చూసే నాథుడే లేడు..ప‌రువు తీసిన త‌న్వీర్ అహ్మ‌ద్

టీమిండియాకు ఆడ‌ట‌మే నాకు ఇష్టం లేదు..బీసీసీఐపై ర‌జ‌త్ తిరుగుబాటు !

Big Stories

×