Nitish Kumar Reddy – SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ప్రారంభానికి చాలా రోజుల సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చి 15వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ షోరూ అవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి ఇప్పటి నుంచే వేడి వాడి చర్చ జరుగుతోంది. అటు ట్రేడింగ్ కూడా ప్రారంభించేసాయి అన్ని జట్లు. తమకు నచ్చని ప్లేయర్లను వదులుకుంటూ… కావలసిన ఆటగాళ్లను ట్రేడ్ ద్వారా తీసుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలోనే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పైన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం వదిలించుకునే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. అతడిని ట్రేడ్ ద్వారా… పంజాబ్ కింగ్స్ జట్టుకు అప్పగించి… ఆ జట్టులో ఉన్న స్పిన్నర్ చాహల్ ను తీసుకోవాలని కావ్య పాప స్కెచ్ వేశారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో జట్టును బలిష్టం చేసేందుకు కావ్య పాపా ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే అవసరం లేని ఆటగాళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రేడింగ్ ద్వారా మరికొంతమంది ప్లేయర్లను తప్పించి.. ఇతర జట్ల ప్లేయర్లను తెచ్చుకునే ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రెడ్డిని వదిలించుకునే పనిలో పడ్డారట కావ్య పాప. ఇందులో భాగంగానే పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను ట్రేడ్ ప్రక్రియ ద్వారా హైదరాబాద్ జట్టులోకి తీసుకువచ్చేలా… ప్రీతి జింటాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రీతీ జింటా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ ట్రేడ్ డీల్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి స్పిన్నర్ అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన కనబరిచిన చాహల్ లాంటి వాళ్లు ఉంటే.. హైదరాబాద్ కు మంచి ఫలితాలు వస్తాయి. గత సీజన్ లో కూడా సరైన స్పిన్నర్ లేక ఇబ్బంది పడింది హైదరాబాద్. అందుకే చాహల్ ను జట్టులోకి తీసుకునే ప్లాన్ వేశారు కావ్య పాప. ఇందు కోసం తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని బలి చేసేందుకు కావ్య సిద్ధమయ్యారట. ఈ విషయాన్ని ఇప్పటికే అతడికి తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నితీష్ కుమార్ రెడ్డిని మొదట అడిగింది పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా అని తెలుస్తోంది. అందుకే కావ్య పాప కూడా ముందుకు వచ్చిందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం